• సానుకూలంగా స్పందించిన తెలంగాణ అటవీ శాఖ పీసీసీఫ్, ఐఎఫ్ఎస్ అధికారిణి డాక్టర్ సి.సువర్ణ 
  • తెలంగాణ అటవీ సంపదలు.. జీవ జాలానికి జీవన నెలవులు అని వ్యాఖ్య
  • పీసీసీఎఫ్‌ను మర్యాద పూర్వకంగా కలిసిన ఔల్స్ ఎన్జీఓ
  •  తెలంగాణ అటవీ శాఖతో ఔల్స్ ఎన్జీఓ సేవల కొనసాగింపు: ఇందారం

వేద న్యూస్, హైదరాబాద్: 

తెలంగాణ రాష్ట్ర అటవీ శాఖ మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమంలో భాగంగా తెలంగాణ రాష్ట్ర అటవీ శాఖ ముఖ్య అధిపతి కొత్తగా బాధ్యతలు చే పట్టిన ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్, హెడ్ ఆఫ్ ఫారెస్ట్ ఫోర్స్ డా. సి. సువర్ణ, ఐ.ఎఫ్.ఎస్ ను అటవీ శాఖ ముఖ్య కార్యాలయం అరణ్య భవన్, హైదరాబాద్‌లో ఓరుగల్లు వైల్డ్ లైఫ్ సొసైటీ, ఎన్.జి.ఓ., బృందం మర్యాద పూర్వకంగా కలిసి శుభ్యకాంక్షలు తెలిపింది. ఇది ఇరువురికి (అటవీశాఖ – ఔల్స్ ఎన్.జి.ఓ.) తమ అభివృద్ధి పథంలో ఒక గొప్ప శుభపరిణామంగా ఉందని ఔల్స్ వారు తెలిపారు. 

ఈ సందర్భంగా ఓరుగల్లు వైల్డ్ లైఫ్ సొసైటీ వ్యవస్థాపక అధ్యక్షుడు, ఇందారం నాగేశ్వర్ రావు మాట్లాడుతూ తమ ఎన్.జి.ఓ., ఓరుగల్లు వైల్డ్ లైఫ్ సొసైటీ…, వనాలను, వణ్యాలను, సహజ వనరులను, పర్యావరణాన్ని రక్షంచుటలో ఏవిధంగా కృషి చేస్తుందో పీ.సీ.సీ.ఫ్., డా.సి.సువర్ణ, ఐ.ఎఫ్.ఎస్. కు వివరించామని తెలిపారు.

వివరణలో భాగంగా ఎన్.జి.ఓ., ఓరుగల్లు వైల్డ్ లైఫ్ సొసైటీ ముందునుండి అటవీశాఖతో కలిసి చేస్తున్న కార్యక్రమాలను వివరిస్తూ… అడవుల, అటవీ జంతువుల, అటవీ ఆవాసాల, పర్యావరణ, సహజవనరుల రక్షణ, అభివృద్ధి కోసం 2018 తమ సంస్థ ఏర్పటై చురుకుగా పాల్గొంటు అనేక కార్యక్రమాలను అటవీశాఖతో ప్రత్యేక్షంగానూ, పరోక్షంగానూ బాగాస్వామ్యం ఏర్పాటు చేసుకొని ముందుకెలుతున్నామని తెలిపినట్టు వెల్లడించారు. 

అడవులను రక్షించడంలో ముఖ్య పాత్ర పోసిస్తూ.. అవసరమైన చోట్లలో స్థానికంగా పెరిగే అడవి చెట్లను నాటడం (అఫారెస్టేషన్, రరిఫారెస్టేషన్), వాటి రక్షణ భాద్యతగా తీసుకోవడం, బోరుబావులు వేయించడం జరిగిందని, విద్యార్థులకు అడవుల వల్ల లాభాలు, అడవులు లేకపోతే తలెత్తనున్న సమస్యలు, వృక్ష, జంతుజాలం సమన్వయం, అటవీ జంతువుల ఆవస్యకత, మానవ-జంతు వైరం మొదలగు విషయాల పట్ల అవగాహన కల్పించడం కోసం అడవులు, అటవీ జంతువులు, అటవీ ఆవాసాల మనుగడపై మంచి విషయ పరిజ్ఞానము, పర్యావరణ విద్య అవగాహనా ఉన్న పర్యావరణవేత్తల పర్యవేక్షణలో, ఫారెస్ట్ డిపార్ట్ మెంట్ సంయుక్త ఆధ్వర్యంలో “వనదర్శిని” అనే కార్యక్రమాలను ఎన్నింటినో చేశామని, చేస్తున్నామని అటవీశాఖ అందుకు ఎంతో సహకరిస్తోందనీ, తద్వార మంచి ఫలితాలను సాధిస్తున్నామని వివరించారు. 

అటవీ శాఖ హరిత తమలాంటి హరిత ఎన్.జి.ఓ.ల సహకారంతో అనేక అటవీ రక్షణ, అడవుల అవగాహణ కార్యక్రమాలను చేయవచ్చని.. ఉదాహరణగా తమఎన్.జి.ఓ. బృందం చేస్తున్న కార్యక్రమలైన అటవీ నడక (ఫారెస్ట్ వాక్), పక్షుల వీక్షణం, వాటి లెక్కింపు, (బర్డ్ వాక్ అండ్ కౌంటింగ్), సీతకొకచిలుకల లెక్కింపు (బటర్ఫ్లై కౌంటింగ్), అటవీ జీవన ఛాయాచిత్ర సేకరణ (వైల్డ్ లైఫ్ ఫొటోగ్రఫీ), జలపాతల అన్వేషణ (వాటర్ఫల్స్ సెర్చింగ్), వివిధ ఆవాసాలలో వివిధరకాల వృక్ష, జంతు ఘనణ, ప్రకృతి విపత్తుల అంచనలో భాగస్వామ్యం, ఇప్పటి వరకు వైల్డ్లైఫ్ (ప్రొటెక్షన్ అండ్ కన్సర్వేషన్) యాక్ట్, 1972 చట్టం, ది ఇండియన్ ఫారెస్ట్ యాక్ట్, 1927, టి.యస్ వాల్టా చట్టం, 2014 మొ. చట్టాల క్రింద తాము దగ్గరుండి శాయంపేట రేంజ్ నుండి 15 కేసులకు పైగా ఫారెస్ట్ డిపార్టుమెంటుంతో కలిసి వేట నిరోధక చర్యలు (యాంటి పోచింగ్ ఆక్టివిటీస్), వాటికీ రిమాండు చేయించి, శిక్షలు పడేలా సహకరించి, జైల్లో వేయించామని చెప్పారు. వేటాడాలంటేనే వేటగాళ్లకు వెన్నుపూసలో వొనుకుపుట్టేలా చేస్తున్నామని, అడవుల నరికివేతను, అక్రమ అడవుల ఆక్రమణనలో డిపార్ట్మెంటుకు చేయూతనిస్తూ సహరిస్తున్నామని స్పష్టం చేశారు.  

అడవులు, పర్యావరణం ఫారెస్ట్ డిపార్ట్మెంటుల ద్వారా ప్రభుత్వాలకు మంచి ఆదాయాన్ని సమాకూర్చే వనరులని, భారతదేశం ఆశ్చర్యపోయేంత జలపాతాలు ఉమ్మడి వరంగల్ జిల్లాలలో ఉన్నాయని అందుకు అటవీ టూరిజం దర్శనం ద్వారా, అటవీ బసల ద్వారా, అటవీ ఆవాస ప్రేమికులకు, అటవీ హరిత ఔత్సహికులకు, వృక్ష జంతు ప్రేమికులు, అటవీ జంతు, వృక్ష, ఆవాస పరిశోదకులనుండి ఆదాయాన్ని సమాకుర్చుకోవచ్చని వెల్లడించారు.

అందుకు సరియైన ఆదాయం వచ్చే అటవీ సంపద మనరాష్ట్రంలోని పాఖల అభయారణ్యం, భీముని పాదం, మైలారం గుహలు, పాండవుల గుట్టలు, దేవునూర్-ఇనుపరాతిగట్లు, వరంగల్, ములుగు, కొత్తగూడెం, జయశంకర్ భూపాలపల్లి, ఖాగజ్ నగర్, నిర్మల్, జన్నారం అడవులు (కవాల్ పులుల అభయారణ్యం), అమ్రాబాద్ పులుల అభయారణ్యం, పెంచికలపేట, ఆదిలాబాద్ జిల్లాలలో మంచి అటవీ టూరిజం చేసుకోవచ్చని తెలుపుతూ తాము చేస్తున్న కృషిని తెలిపారు.

అలాగే ప్రతిసాంవత్సరం ఒక నిర్ధిష్ట పర్యావరణ రోజుల కార్యక్రమ వివరాలతో కూడిన క్యాలెండరను తయారుచేసుకొని.. కార్యక్రమాలను నిర్వహిస్తూ, విద్యార్థులకు అడవులపట్ల, అటవీ జంతువులపట్ల, అటవీ ఆవాసాల పట్ల అవగాహన నిమిత్తం వివిధ పాఠశాలల నుండి పాఠస్థాయి ఔత్సహిక విద్యార్థినీ విద్యార్థులకు చిత్రలేఖనం, ఉపన్యాసం, వ్యసారచనం మొదలగు ప్రతిభా పాఠవ పోటీలను సొంతఖర్చులతో నిర్వహిస్తున్నామని వివరించారు. విజేతలకు బహుమతి ప్రధానంగా మెమెంటోలు, అభినందన ధ్రువపత్రాలు ఇస్తూ,వివిధ పాఠశాలలలో ఉపాధ్యాయులు, ఫారెస్ట్ డిపార్టుమెంటు సహకారంతో, విద్యార్థులచేత ప్లాస్టిక్ ఏరివేత, మొక్కలను నాటిస్తూ హరితహారం కార్యక్రమాలను చేస్తూ ప్రకృతిని ఎల్లప్పుడూ రక్షిస్తుండాలని.. వారికి ఆచరణత్మకంగా చూపిస్తూ ఆదర్శంగా ఉండాలని నేర్పుతున్నామన్నారు.

వివిధ కార్యక్రమ సందర్భాలలో అటవీ కృషిలో, అడవుల ప్రాధాన్యతలో సేవలందించిన పాల్గొన్న వారికీ వారిపేరుపైన అభినందన ధ్రువపత్రాలు ఇస్తూ,సన్మాన సత్కారాలను చేసి ప్రోత్సాహస్తున్నామని తెలియ చేశారు.

ఇందారం వివరించిన తమ ఎన్.జీ.ఓ. నిర్వహిస్తున్న అటవీ రక్షణ, అభివృద్ధి పనులు, అటవీ టూరిజం ఆదాయ అవకాశాలు గురించి, పర్యావరణ విద్యపై తెలిపిన వివరాలు వివరించగా ఎంతో ఓపికతో విన్న తెలంగాణ అటవీ అధిపతి ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ ,హెడ్ ఆఫ్ ఫారెస్ట్ ఫోర్స్ డా.సి.సువర్ణ, ఐ.ఎఫ్.ఎస్. ఎంతో ఓర్పుతో సమయాన్ని కేటాయించి విన్నారని చెప్పారు. 

పీసీసీఎఫ్ స్పందిస్తూ “అటవీ సంపదలు ఒక దేశానికి నిరంతరంగా ఆదాయన్ని సమాకూర్చే ఆర్థిక వనరులు. జీవ జాలానికి జీవన ఆవాసాలు” అని చిప్కో ఉద్యమకారుడు సుందర్లాల్ బహుగుణ చెప్పినట్లుగా… అడవులు జీవజాతుల రక్షణలో, ఆవాసాల మనుగడలో ప్రధాన పాత్రనుపోసిస్తాయని  పేర్కొన్నారని తెలిపారు. భవిష్య అటవీ అభివృద్ధి, రక్షణ ప్రణాళికలల్లో తప్పకుండ ఓరుగల్లు వైల్డ్ లైఫ్ సొసైటీ, ఎన్.జి.ఓ. బృంద సేవలు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఉపయోగించుకుంటుందని సానుకూల్సముగా స్పందించారు.

అతి త్వరలో వరంగల్, ములుగు, జయశంకర్ భూపాలపల్లి, కొత్తగూడెం అడవులను పర్యేక్షణ చేయనున్నామని, పర్యవేక్షణలో ఓరుగల్లు వైల్డ్ లైఫ్ సొసైటీ, ఎన్.జి.ఓ. ను కూడా పిలుస్తామని తెలియ చేస్తూ, నాగేశ్వర్ రావు స్వయంగా తీసిన ఒక జలపాత చేయచిత్రాన్ని బహూకరించగా చాలా సంతోషంతో స్వీకరించి, అభినందించారు.

ఓరుగల్లులో  ‘‘ప్రపంచ పులుల దినోత్సవ వేడుకలకు’’ పీసీసీఎఫ్‌కు ఆహ్వానం

ఈ నెల 29న నిర్వహించనున్న ‘‘ప్రపంచ పులుల దినోత్సవ వేడుకలు ’’జరిపేందుకు వరంగల్ వేదికగా ఓరగల్లు వైల్డ్లైఫ్ సొసైటీ ఏర్పాటు చేసుకుంటుంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తెలంగాణ అటవీ శాఖ పిసిసిఎఫ్ డాక్టర్ సి. సువర్ణ ఐ.ఎఫ్.ఎస్. ను ముఖ్య అతిథులుగా ఆహ్వానించారు. అందుకు పీసీసీఫ్ సానుకూలంగా స్పందిస్తూ వస్తానని హామీ ఇచ్చారు.

ఈ మీట్ అండ్ గ్రీట్ పరిచయ కార్యానికి సహకరించి పీ.సీ.సీ.ఎఫ్ డా. సి. సువర్ణ, ఐ.ఎఫ్.ఎస్. ను పరిచయం చేయించిన డీసీఫ్ మాధవరావు కు, ఓరుగల్లు వైల్డ్ లైఫ్ సొసైటీ, ఎన్.జి.ఓ. వ్యవస్థాపక అధ్యక్షుడు, ఇందారం నాగేశ్వర్ రావు బృంద సభ్యులు ప్రతేక కృతజ్ఞతలు తెలియజేశారు.