వేద న్యూస్, డెస్క్:
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నేతృత్వంలోని కేంద్రం పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గించేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. దీనిపై ప్రధాని నరేంద్ర మోడీ స్వయంగా ప్రకటన చేయనున్నారని టాక్. 2024లో లోక్సభ ఎన్నికలు జరగనున్న సంగతి అందరికీ విదితమే. ఈ క్రమంలోనే ఈ ఎన్నికలకు ముందే పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గే అవకాశం ఉన్నట్లు చర్చ జరుగుతోంది. పెట్రోల్ ధరపై రూ.10 వరకూ తగ్గే అవకాశం ఉందని సమాచారం. సంక్రాంతి కానుకగా ప్రధాని మోడీ నిర్ణయం తీసుకుంటారని తెలుస్తోంది. చూడాలి మరి..ఏం జరుగుతుందో..
