వేద న్యూస్, హన్మకొండ:

రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు అన్ని గ్రామ పంచాయతీల్లో స్వచ్ఛదనం -పచ్చదనం ప్రోగ్రామ్ నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా మంగళవారం దామెర మండల పరిధిలోని వెంకటాపూర్, సింగరాజుపల్లి గ్రామాలలో వివిధ రకాల మొక్కలు 200 నాటారు. 100 మొక్కలు గ్రామస్తులకు పంపిణీ చేశారు. కార్యక్రమంలో సీఐ రంజిత్ రావు, ఎస్ఐ కొంక అశోక్, సిబ్బంది, గ్రామస్తులు పాల్గొన్నారు.