వేద న్యూస్, డెస్క్ :
మహబూబాబాద్ సబ్ రిజిస్ట్రార్ తస్లీమా ఏసీబీ అధికారులకు చిక్కారు. ఓ ల్యాండ్ రిజిస్ట్రేషన్ చేసే విషయంలో ఆమె డబ్బులు డిమాండ్ చేయడంతో బాధితుడు ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు.
కాగా శుక్రవారం పక్కా ప్రణాళికతో రిజిస్ట్రార్ కార్యాలయంలోనే బాధితుడి నుంచి రూ.19200లు లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు వల వేసి పట్టుకున్నారు.