• ది నేషనల్ కన్జూమర్ రైట్స్ కమిషన్ రాష్ట్ర వైస్ చైర్ పర్సన్ అనితారెడ్డి .
  • మానసిక దివ్యంగుల ఆశ్రమంలో బతుకమ్మ సంబురాలు ప్రారంభం

వేద న్యూస్, వరంగల్ ప్రతినిధి:

పూలను కొలిచే గొప్ప సంస్కృతి మన తెలంగాణ సంస్కృతి అని ది నేషనల్ కన్జూమర్ రైట్స్ కమిషన్ తెలంగాణ రాష్ట్ర వైస్ చైర్ పర్సన్, అనురాగ్ సొసైటీ ప్రెసిడెంట్ డాక్టర్ అనితా రెడ్డి అన్నారు. ఆమె శుక్రవారం హన్మకొండలోని స్పందన మానసిక దివ్యంగుల ఆశ్రమంలో బొడ్డెమ్మ, బతుకమ్మ వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరై సంబురాల ప్రారంభించారు.

ఈ సందర్భంగా డాక్టర్ అనితా రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ సంస్కృతీ సంప్రదాయాలకు ఈ బతుకమ్మ పండుగ నిదర్శనం అని చెప్పారు.

ప్రకృతిలోని పూలన్నింటిని ఒక దగ్గర చేర్చి బతుకునిచ్చే అమ్మవారిని బతుకమ్మగా పేర్చి మహిళలు అత్యంత భక్తి శ్రద్ధలతో నిర్వహించే ఈ పండుగను..ఈ సంస్థ లోని మానసిక దివ్యంగుల మధ్యన జరుపుకోవడం చాలా సంతోషంగా ఉందని వివరించారు.

పూలను దేవతగా కొలిచేది ఒక తెలంగాణ రాష్ట్రం లోనేనని వెల్లడించారు. అనంతరం బతుకమ్మ ఆట పాటలు, కోలాట నృత్యాలతో పిల్లలు, టీచర్స్‌తో పాటుగా డాక్టర్ అనితా రెడ్డి సందడి చేశారు. కార్యక్రమంలో డాక్టర్ అనితా రెడ్డి, సంస్థ నిర్వాహకులు సుచరిత, వసుధ హరిత, ఉమ, మానస, రాజేందర్ రెడ్డి, సిబ్బంది పిల్లలు పాల్గొన్నారు.