• ఔల్స్, అటవీ శాఖ హన్మకొండ సంయుక్త ఆధ్వర్యంలో వేడుకలు
  • వ్యక్తగతంగా అందరిలో మార్పు రావాలి: భద్రాద్రి, వరంగల్ సీ.సీ.యఫ్, డి. భీమా నాయక్ ఐ.యఫ్.ఎస్
  • సింగల్ యూజ్ ప్లాస్టిక్ బాగ్స్ ను వాడడం నిషేడించుకోవాలి: వరంగల్, హన్మకొండ, జనగాం డి.ఎఫ్.ఓ.అనుజ్ అగర్వాల్, ఐ.యఫ్.ఎస్
  • ప్లాస్టిక్ అంతం – ప్రపంచ పంతం: ఔల్స్, సంయుక్త కార్యదర్శి పిట్టల రవిబాబు 

వేద న్యూస్, వరంగల్:

ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని కాకతీయ జూ పార్కు లో బుధవారం విద్యార్థిని, విద్యార్థులకు చిత్రలేఖనం, వ్యాసరచన, ఉపన్యాస పోటీలను నిర్వహించారు. శుక్రవారం.. ప్రపంచ పర్యావరణ దినోత్సవ సందర్భంగా హనుమకొండ జిల్లా అటవీ శాఖాధికారి అనూజ్ అగర్వాల్, ఐఎఫ్ఎస్ ముఖ్య అతిథిగా విచ్చేసి జెండా ఊపి సైకిల్ ర్యాలీ ని ప్రారంభించారు. ఈ కార్యక్రమం ట్రైసిటీ రైడర్స్ అసోసియేషన్ అధ్యక్షులు చంద్రశేఖర్ రెడ్డి, ఏజే పెడల్స్ అధినేత జయంత్, శ్రేయాన్, నిఖిల్ సంయుక్తంగా నిర్వహించారు.

ఈ ప్రోగ్రామ్ కు ముఖ్య అతిథిగా మట్టేవాడ పోలీస్ స్టేషన్ సర్కిల్ ఇన్ స్పెక్టర్ ఆఫ్ పోలీస్ గోపి విచ్చేశారు . ఈ సందర్భంగా గోపి మాట్లాడుతూ పర్యావరణాన్ని పరిరక్షించుకోవడం మనందరి బాధ్యతని,. పర్యావరణ పరిరక్షణే మన మనుగడ అని తెలియజేశారు. కార్యక్రమంలో కాకతీయ జూ పార్క్ క్యూరేటర్, ఎఫ్.ఆర్.ఓ. మయూరి, ఓరుగల్లు వైల్డ్ లైఫ్ సొసైటీ సంయుక్త కార్యదర్శి పిట్టల రవి బాబు, అటవీ శాఖ సిబ్బంది సైకిల్ రైడర్స్ అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఈ ర్యాలీ నగర వీధుల గుండా ఫారెస్ట్ ఆఫీసు నుండి కాకతీయ జూ పార్కు వరకు జరిగింది.

కాకతీయ జూలాజికల్ పార్కు, హనుమకొండ నందు ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా డి. భీమా నాయక్, ఐ.ఎఫ్.ఎస్., చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్స్, సర్కిల్, వరంగల్,అనూజ్ అగర్వాల్, ఐ.ఎఫ్.ఎస్., జిల్లా అటవీ శాఖాధికారి, వరంగల్, హనుమకొండ హాజరైనారు. కార్యక్రమంలో ముఖ్య అతిథులు, ఔల్స్ బాధ్యులు మొక్కలను నాటినారు. ఆతర్వాత డి. భీమా నాయక్, ఐ.ఎఫ్.ఎస్., మాట్లాడుతూ పర్యావరణాన్ని రక్షించడంలో ప్రతి ఒక్కరు భాద్యతగా ఉండాలని, “సింగల్ యూజ్ ప్లాస్టిక్” నిషేధించాలని కోరారు.

ఓరుగల్లు వైల్డ్ లైఫ్ సొసైటీ సంయుక్త కార్యదర్శి, పర్యావరణవేత్త పిట్టల రవిబాబు మాట్లాడుతూ పర్యావరణాన్ని రక్షించడంలో ప్రతి ఒక్కరు భాద్యతగా భారత రాజ్యంగంలోని ఆర్టికల్ 51 A/(g) ప్రకారంగా ప్రతి భారత పౌరుని యొక్క ప్రాథమిక విధిగా మనచుట్టు ఉన్న పర్యావరణంలోని అడవులు, నదులు, సరస్సులు, భూమి, మట్టి, ఇసుక గాలి, నీరును కాలుస్య కోరలనుండి రక్షించుకుంటూ మూగ జీవాలైన జంతువుల పట్ల భూత దయ కల్గి ఉండాలని, సహజ వనరులను రక్షించాలని కోరారు.

అదే విధంగా ఈ సంవత్సరం ప్రపంచ పర్యావరణ పరిరక్షణ దినోత్సవాన్ని పురస్కరించుకొని “ఎండింగ్ ప్లాస్టిక్ పొల్యూషన్ గ్లోబల్లి“ అనే అంశాన్ని పురస్కరించుకొని.. ప్రతి ఒక్కరు భాద్యతగా సింగిల్ యూజ్ ప్లాస్టిక్‌ను పూర్తిగా నిషేధించి, మాంసాన్ని , చేపలను , చికెన్ తెచ్చుకోవడానికి ప్లాస్టిక్ సంచులకు బదులు స్టీల్ బాక్స్ లను ఉపయోగించాలని, బజారుకు వెళ్లిపుడు చేతి సంచులను, జూట్ బ్యాగ్ లను తీసుకెళ్లాలని  కోరారు.

వ్యక్తిగతంగా ప్రతి ఒక్కరు పాటిస్తేనే ప్రపంచ వ్యాప్తంగా ప్లాస్టిక్ అంతమవుతుందని, సుస్తిర పర్యావరణాన్ని రాబోయే తరాలకు ఇవ్వగలమని గుర్తుచేశారు. ఈ సందర్బంగా అటవీ, వన్యప్రణుల, పక్షుల ఛాయా ఛిత్రాలను పర్యావరణ విద్య ప్రదర్శన కొరకు ఆవిష్కరించి విద్యార్థులతోపాటు తిలకించారు.

జూ పార్కు రేంజ్ అఫీసర్ బి.మయూరి మాట్లాడుతూ ఈ సవంత్సరం జూపార్క్ ను ప్లాస్టిక్ రహిత జూ గా మార్చుతున్నామని, అదే విధంగా జూపార్క్కు ఒక తెల్ల పులి, సింహాలను తెచ్చే ప్రయత్నంలో ఉన్నామని ప్రకటిస్తూ, జూ పార్కు అభివృద్ది కొరకు రూ.5 కోట్లు కేటాయించినందుకు పర్యావరణ, అటవీ శాఖ మంత్రి కొండా సురేఖకు కృతజ్ఞ తలు తెలియచేస్తూ, సంతోశాన్ని వ్యక్తపరిచారు.

అలాగే ప్రోగ్రాము కు టెక్నికల్‌గా  సహకరించిన ఔల్స్ అధ్యక్షులు ఇందారం నాగేశ్వర్ రావు, వన సేవ సమితి కార్యదర్శి G.నరేష్ లకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియచేసారు. అదేవిధంగా వివిధ పోటీలలో గెలుపొందిన విద్యార్థిని, విద్యార్థులకు బహుమతులు ప్రదానం చేశారు.

అతిథులను ఔల్స్ యన్.జి.ఓ. అటవీ ఛాయాచిత్ర మోమెంటోలతో ఘనంగా సత్కరించింది. ఈ కార్యక్రమంలో హైదరాబాద్ పబ్లిక్ స్కూల్, వరంగల్, తేజస్వి హై స్కూల్, హనుమకొండ, డాఫడిల్స్ హై స్కూల్, హనుమకొండ, ప్లాటినం జూబిలీ హై స్కూల్, హనుమకొండ నుంచి విద్యార్థులు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, పురప్రముఖులు, అటవీ శాఖ సిబ్బంది మరియు జూ పార్కు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.


 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *