వేద న్యూస్, ఆసిఫాబాద్:
నవోదయ 6వ తరగతి ఎంట్రెన్స్ ఎగ్జామ్ కోసం ఆసిఫాబాద్లోని కేపీఎల్ కోచింగ్ సెంటర్లో ప్రత్యేకంగా పిల్లలకు కోచింగ్ ఇస్తున్నారు. ఈ నెల (జూన్) 12 నుంచి క్లాసెస్ స్టార్ట్ అవుతాయని నిర్వాహకులు కిరణ్, సాయి ప్రకాశ్, శాంతిలాల్ ఓ ప్రకటనలో తెలిపారు. ప్రతి రోజూ సాయంత్రం 5 నుంచి 7 గంటల వరకు తరగతులు నిర్వహించనున్నట్టు స్పష్టం చేశారు. తెలుగు, ఇంగ్లిష్ మీడియం స్టూడెంట్స్.. కు ఈ సెంటర్లో కోచింగ్ ఇస్తున్నట్టు వెల్లడించారు.
స్టూడెంట్స్ కు ప్రత్యేకంగా సెపరేట్గా ఒక్కొక్కరి పట్ల శ్రద్ధ వహించి సబ్జెక్ట్స్ చెప్పనున్నట్టు నిర్వాహకులు స్పష్టం చేశారు. వీక్లి టెస్టులు నిర్వహిస్తూ.. విద్యార్థులు పోటీలో నిలబడేలా మనో ధైర్యం పెంచేలా గెస్ట్ లెక్చర్స్ సైతం కండక్ట్ చేయనున్నట్టు తెలిపారు. ఆసక్తి గల వారు 95052 27231, 99489 75401 నంబర్లను సంప్రదించొచ్చని పేర్కొన్నారు.