వేద న్యూస్, వరంగల్ క్రైమ్:
ఓ మర్డర్ కేసులో వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని ఎనుమాముల పోలీస్ స్టేషన్లో.. యూపీలోని హర్దోయి జిల్లా బిలగ్రామ్ మండలం కోయి గ్రామస్తుడైన రితేశ్ సింగ్ అలియాస్ పద్దుపై కేసు నమోదయింది. ఈ మేరకు పీఎస్ ఎస్హెచ్వో ఓ ప్రకటన రిలీజ్ చేశారు. బీఎన్ఎస్ యాక్ట్ 103 (1) ప్రకారం సదరు యువకుడిపై కేసు నమోదు చేసినట్టు వెల్లడించారు. సదరు వ్యక్తి ఫొటోను పోలీసులు మీడియాకు విడుదల చేశారు.
సదరు వ్యక్తి (ఆక్యూజ్డ్) ఎక్కడైనా కనబడినా వెంటనే తమకు ఈ ఫోన్ నంబర్లలో 8712685120 కు లేదా 8712685133, లేదా 8712685288, లేదా 8712685238 సమాచారం ఇవ్వాలని పోలీసులు కోరారు.
