•  కోర్కల్ గ్రామ ప్రజల తీర్పు ప్రత్యేకం
  •  గ్రామ అభివృద్ధియే ధ్యేయం: సర్పంచ్ పూదరి రమ్యకృష్ణ

వేద న్యూస్, హుజూరాబాద్ ప్రతినిధి:

ప్రజాస్వామ్యంలో ప్రజల తీర్పే శిరోధార్యం. ఎంతటి నాయకులనైనా పడగొట్టాలన్నా.. మరింత ఉన్నతస్థాయికి తీసుకెళ్లాలన్నా జనమే అది నిర్ణయిస్తారు. సర్పంచ్ ఎన్నికల్లో వీణవంక మండల పరిధిలోని కోర్కల్ గ్రామ ప్రజలు ప్రత్యేకమే కాదు వినూత్నమైన తీర్పునిచ్చారు. బరిలో పది మంది సర్పంచ్ అభ్యర్థులున్నారు. అధికార, ప్రతిపక్ష పార్టీల తరఫున కంటెస్ట్ చేస్తున్న వారు ఉన్నా కానీ స్వతంత్ర అభ్యర్థి వైపు మొగ్గు చూపారు. 23 ఏండ్ల పూదరి రమ్యకృష్ణ అనిల్‌ను తమ సర్పంచ్‌గా ఎన్నుకున్నారు. దీంతో మండలంలోనే అతి చిన్న వయసు గల సర్పంచ్‌గా ఆమె పాపులర్ అయిపోయారు.

సేవే ధ్యేయం
సర్పంచ్ ఎన్నికల ప్రచారంలో అభ్యర్థుల ప్రచారాలను హోరెత్తించారు. ప్రధాన రాజకీయ పార్టీలకు కొంత ఆదాయ వనరులు బలంగా ఉన్నాయి. అయినా స్వతంత్ర అభ్యర్థిగా బరిలో నిలిచి.. ప్రజాప్రతినిధులుగా అప్పటికే పని చేసిన వారితో పోటీ పడి మరి.. 23 ఏండ్లకే గ్రామ ప్రథమ పౌరురాలిగా ప్రజాశీర్వాదంతో రమ్యకృష్ణ గెలుపొందారు. కోర్కల్ గ్రామంలో 10 వార్డులుండగా, 1,400 ఓట్లు ఉన్నాయి. 1,229 ఓట్లు పోలింగ్‌లో నమోదు కాగా, 157 ఓట్ల మెజారిటీతో పూదరి రమ్యకృష్ణ అనిల్ సర్పంచ్‌గా గెలుపొందారు.

సొంతూరికి సేవ
తను పుట్టి పెరిగిన సేవకు చేయాలనే లక్ష్యంతో ముందుకెళ్తామని కోర్కల్ గ్రామ సర్పంచ్ పూదరి రమ్యకృష్ణ అనిల్ తెలుపుతున్నారు. సర్పంచ్ ఎన్నికల సందర్భంలో తమకు గ్రామ వాస్తవ్యులు, సేవావాది కర్రా హరిన్‌రెడ్డి సహకారం నిండుగా, మెండుగా ఉందని వెల్లడించారు. హరిన్‌రెడ్డి తన తండ్రి జ్ఞాపకార్ధం గ్రామంలో పలు సేవా కార్యక్రమాలు ఇప్పటికే చేపట్టారు.

లక్ష్మీనర్సింహాస్వామి కోర్కల్ ఆలయ కమిటీ చైర్మన్‌గా ఉన్న హరిన్‌రెడ్డి గ్రామంలో విద్య, వైద్యం విషయమై సాయం చేస్తున్నారు. దురదృష్టవశాత్తు ఆ ఊరిలో ఎవరైనా కుటుంబంలో ఒకరు చనిపోతే ఆర్థిక సాయం నిమిత్తం రూ.5 వేలు ఇచ్చారని చెప్పారు. గ్రామంలోని దేవాలయాలకు రూ.లక్ష చొప్పున ఇచ్చారు.

సొంతూరికి సేవ చేసి తనను పెంచిన పెద్దచేసిన సమాజానికి తిరిగిచ్చేయాలనే సదుద్దేశంతో కర్ర హరిన్‌రెడ్డి కోర్కల్ గ్రామానికి విచ్చేయగా, ఆయన సహకారం, ప్రోత్సహం, నిండు మనసుతో ఇచ్చిన ఆశీర్వాద బలంతో తాము సర్పంచ్‌గా గెలిచామని రమ్యకృష్ణ అనిల్ వినమ్రంగా చెబుతున్నారు.

తమను ఆదరించి.. ఆశీర్వదించి.. సర్పంచ్‌గా గెలిపించిన ప్రజలకు చక్కటి సేవలందించి..ప్రజాక్షేత్రంలో నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటామని పూదరి రమ్యకృష్ణ అనిల్ పేర్కొన్నారు.