• యువతకు ఆదర్శంగా నిలిచిన యువకుడు
  • గ్రూప్2 ఎక్సయిజ్ సబ్ ఇన్ స్పెక్టర్ కొలువు సంపాదించిన కోట అరుణ్
  •  పంచాయతీ కార్యదర్శి , గ్రూప్ 2 , గ్రూప్ 3, గ్రూప్ 4 ఉద్యోగాల నూ సంపాదించిన అరుణ్

వేద న్యూస్, జమ్మికుంట:

పట్టుదల, అకుంఠిత దీక్ష, ఆత్మవిశ్వాసం ఉంటే చాలు.. అనుకున్న లక్ష్యాన్ని ఎన్ని ఒడిదుడుకులు ఎదురైనా సాధించొచ్చని నిరూపించారు ఓ యువకుడు. అతనే జమ్మికుంట మున్సిపల్ పరిధిలోని కేశవపురం శ్రీ విద్యారణ్య ఆవాస విద్యాలయం పూర్వ విద్యార్థి కోట అరుణ్ కుమార్.

పువ్వు పుట్టగానే పరమళిస్తుందనే రీతిలో.. తొలి నుంచి చదువులో కోట అరుణ్ రాణించారు. తను పుట్టి పెరిగిన ఊరుతో పాటు కుటుంబం,స్నేహితులు, తనకు విద్య నేర్పిన పాఠశాల గర్వించేలా జీవితంలో ముందుకెళ్లాలని నిర్ణయించుకున్నాడు. అందుకు అనుక్షణం శ్రమిస్తూ.. లక్ష్యాన్ని నిర్దేశించుకుని ముందుకు సాగి విజేతయ్యాడు. 

కరీంనగర్ పట్టణం కిసాన్ నగర్ కి చెందిన కోట అరుణ్ కుమార్ పంచాయతీ కార్యదర్శి నుండి గ్రూప్ 2 ద్వారా ఎక్సైజ్ సబ్ ఇన్స్పెక్టర్ ఉద్యోగం సాధించడంతో పలువురు అభినందించి శు భాకాంక్షలు తెలియజేశారు. కోట అరుణ్ కుమార్ బాల్య , విద్యాభ్యాసం ఆర్ఎస్ఎస్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న సరస్వతి విద్యాపీఠం,శ్రీ విద్యారణ్య ఆవాస విద్యాలయం, జమ్మి కుంటలొ కొనసాగింది. తదనంతరం ఉ న్నత విద్యాభ్యాసం, బి.టెక్ పూర్తి చేసి,పోటీపరీక్షలకు సన్నదం అయి మొదటగా  2018 లో వెలువడిన పంచాయతీ కార్యదర్శి ఫలితాల్లో ఉద్యోగం సాధించారు. ఆ తర్వాత ఉద్యోగానికి రాజీనామా చేసి, మళ్ళీ 2020 లో నుండి ప్రిపరేషన్ సాగిస్తూ ..ఈ మధ్యలో వెలువడిన గ్రూప్ 2 లో 161 ర్యాంక్ తో ఎక్సైజ్ సబ్ ఇన్స్పెక్టర్ గా కొలువు సంపాదించారు.

గ్రూప్ 3 లో 468 ర్యాంక్ తో, గ్రూప్ 4 లో జూనియర్ అసిస్టెంట్ గానూ ఉద్యోగాలు సాధించారు. గ్రూప్ 1 లో ప్రిలిమినరీ అర్హత సాధించినప్పటికీ,మెయిన్స్ లో ఆశించిన ఫలితాలు రాలేదు.

గ్రూప్ వన్ సాధించడమే లక్ష్యం: అరుణ్ కుమార్

రానున్న రోజుల్లో  గ్రూప్ 1,సివిల్స్ లో ఉద్యోగం సాధించడమే లక్ష్యంగా కోట అరుణ్ కుమార్ కృషి చేస్తున్నారు. “ఈ విజయం సాధించడంలో నా తల్లిదండ్రులు,నా కుటుంబ సభ్యులు,శ్రీ విద్యారణ్య ఆవాస విద్యాలయం జమ్మికుంట లో అలవర్చి న క్రమశిక్షణ, దేశభక్తితో, సమాజానికి సేవ చేయాలనే దృఢమైన సంకల్పంతో ముందుకు కొనసాగుతున్నానని” కోట అరుణ్ కుమార్ ఈ సందర్భంగా తెలిపారు.