•  ఈ నెల 23న స్వర్గీయ నూకల నరేష్ రెడ్డి విగ్రహా ప్రతిష్ట, మొదటి వర్ధంతి కార్యక్రమ నిర్వహణ
  • నాన్నను ఆదరించిన విధంగా తనను ఆదరించాలని కోరిన తనయుడు నూకల అభినవ్ రెడ్డి
  • రాజకీయలకు అతీతంగా వర్ధంతి ప్రోగ్రామ్ కు  రావాలని పిలుపు
  • మాజీ ఎంపీ సురేందర్ రెడ్డి చేతుల మీదుగా విగ్రహా ఆవిష్కరణ ఉంటుందని వెల్లడి

వేద న్యూస్, మరిపెడ:

మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండలం పురుషోత్మైగూడెం ఏరువాక వ్యవసాయ క్షేత్రంలో ఈ నెల 23 తేదీన స్వర్గీయ నూకల నరేష్ రెడ్డి మొదటి వర్ధంతి సందర్భంగా విగ్రహ ఆవిష్కరణ ఉంటుందని నరేష్ రెడ్డి తనయులు వెల్లడించారు. బుధవారం విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. రాష్ట్రంలో డోర్నకల్ నియోజక వర్గంలో రాజకీయ రంగంలో చెరగని ముద్ర వేసిన నూకల నరేష్ రెడ్డి నీ ఆదరించిన విధంగా తనను ఆదరించాలనీ జిల్లా, నియోజక వర్గ ప్రజలను తనయుడు కోరారు.

రాష్ట్ర రాజకీయలలో కీలక పదవులలో పని చేసిన సంగతి అందరి తెలుసునని, 1989నుండి 2024 వరకు రాజకీయ రంగంలో ఎంతో మందికి రాజకీయ రంగంలో ఎదుగుదలకు తోడ్పడి వారి రాజకీయ భవిష్యత్తు పునాదులు వేశారని తెలియజేశారు.

1991లో సెహ్నా యూత్ ను స్థాపించి ఎంతో మందికి రాజకీయ భవిష్యత్తు పునాది వేశారని, ఇప్పుడు ఆ బాధ్యత పూర్తి స్థాయిలో తీసుకొని రాజకీయ రంగంలో రాణించే విధంగా ఆశీర్వాదించాలని కోరారు. తాను నాన్న సమక్షంలో 2018 లో పురుషోత్తమైగూడెం గ్రామ పంచాయతీ నుండి సర్పంచ్ గా నిలబెట్టి రాజకీయంగా మొదటి పునాదీ వేశారని చెప్పారు. ఆయన రాజకీయ వారసుడి గా రాజకీయ రంగంలో రాణించాలని కోరుకుంటున్నానని వెల్లడించారు. 

నూకల నరేష్ రెడ్డికి సహకరించి ఆయన వెంట నడిచిన నాయకులకు, ప్రజలకు ధన్యవాదాలు తెలియచేస్తున్నాను. అలాగే తనను కూడా జిల్లా రాజకీయ రంగంలో రాణించే విధంగా ఆశీర్వాదించాలని కోరారు.

23 తేదీన మొదటి వర్ధంతి, స్వర్గీయ నూకల నరేష్ రెడ్డి విగ్రహా ప్రతిష్ట ఆవిష్కరణకు మాజీ ఎంపీ సురేందర్ రెడ్డి ముఖ్య అతిథిగా వస్తున్నారని, జిల్లా నలుమూల నుండి పెద్ద ఎత్తున రాజకీయ నాయకులు, ప్రజలు,అభిమానులు తరలిరావాలని కోరారు.

కార్యక్రమంలో స్వర్గీయ నూకల నరేష్ రెడ్డి కుమారులునూకల అనిరుధ్ రెడ్డి, నూకల వేణుగోపాల్ రెడ్డి మాజీ డి సి యంఎస్, బండీ వెంకట్ రెడ్డి మాజీ జడ్పీటీసీ కురవి,బానోతు రాము నాయక్ మాజీ జడ్పీటీసీ కురవి, గాంధసిరి అంబరీష మాజీ ఎంపీటీసీ, బానోతు రాంలాల్ మాజీ సర్పంచ్,ముళ్ళ మురళి ధర్ రెడ్డి మాజీ జడ్పీటీసీ చిన్న గూడూరు, సమ్మెట రాము మాజీ ఎంపీటీసీ, ఆఫ్ఏ సి ఎస్ ఛైర్మన్,గడ్డం వెంకట్ రెడ్డి కేసముద్రం మార్కెట్ డైరెక్టర్,జిల్లా కాంగ్రెస్ నాయకులు కాలం రవీందర్ రెడ్డి,యార్ల మురళిధర్ రెడ్డి, గుండాగానీ సుందర్, తదితరులు పాల్గొన్నారు.