వేద న్యూస్, చొప్పదండి:
బీఆర్ఎస్ లీడర్ ఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్ అరెస్టు అక్రమమని, ఆయనను జైలుకు పంపాలనే యోచనలో కాంగ్రెస్ సర్కార్ ఉందని బీఆర్ఎస్ యువజన విభాగం చొప్పదండి నియోజకవర్గ ఉపాధ్యక్షులు భక్తు విజయ్ కుమార్ విమర్శించారు.
ప్రజల కష్టాల కోసం బిఆర్ఎస్ పార్టీ ఆలుపెరగని పోరాటం చేస్తున్న తరుణంలో బుధవారం దిందా గ్రామాం నుండి రైతులు పాదయాత్ర చేసుకుంటూ వాళ్ళ బాధలను ముఖ్యమంత్రి కి వివరించాలని 400 కి.మీ వరకు హైదరాబాద్ కు పాదయాత్ర చేస్తూ శామీర్ పేట వరకు వెళ్లగా.. పోలీసులు వారిని అపి బస్సులలో సిర్పూర్ పంపించారు. వారికీ మద్దతుగా గురువారం డా. ఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్ మద్దతుగా ధర్నా చేసినందుకు, వారిని అక్రమoగా అరెస్ట్ చేయడం సిగ్గు చేటు అని అన్నారు.
నిజంగా రైతుల పట్ల ప్రేమా ఉంటె గత ప్రభుత్వం ఇచ్చిన పట్టాలు వారికీ తిరిగి ఇవ్వాలని డిమాండ్ చేసారు. బీసీ లకు 42% రిజర్వేషన్ కల్పిస్తున్నామని, మరో వైపు బీసీ ల భూముల లాక్కోవడం ప్రజలు గమనిస్తున్నారు అని అన్నారు.
రాజ్యాంగంలోని ఆర్టికల్ 19 ప్రకారం నిరసన తెలిపే హక్కు కూడా లేకుండా రేవంత్ రెడ్డి సర్కార్ చేస్తున్నదని ఆరోపించారు. ప్రవీణ్ కుమార్ మాజీ ప్రభుత్వ అధికారి అని కూడా చూడకుండా ఈ ప్రభుత్వం దౌర్జన్యంగా అరెస్ట్ చేసిందన్నారు. ఇప్పటికే తెలంగాణలో 550 మంది రైతులు మరణించారని వివరించారు.