వేద న్యూస్, కరీమాబాద్:

చల్లగా బీరు వేసి చిల్ అవుదాం అనుకున్న ఓ యువకుడికి షాక్ తగిలింది. శుక్రవారం మధ్యాహ్నం వరంగల్ తూర్పు నియోజకవర్గంలోని కరీమాబాద్ ప్రాంతంలో ఓ వైన్ షాప్ లో ఓ యువకుడు బీర్ బాటిల్ కొనుగోలు చేశాడు. బయటికి వచ్చి బీరు తాగే లోపు ఆ బాటిల్లో ఏదో తేడాగా కనిపించింది.

నిశితంగా పరిశీలించగా ఆ బీర్ బాటిల్ లో చెత్తతో పాటు పాకూరు కనిపించింది.

 

ఇంకేముంది ఆ యువకుడు బీర్ బాటిల్ ని అందులో కనిపించే చెత్త, పాకురును వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. ఇక సోషల్ మీడియాలో ఈ వీడియో వైరల్ గా మారింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *