వేద న్యూస్, వరంగల్:
హైదరాబాద్ లోని డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ సచివాలయంలో మంత్రి సీతక్కను, అసెంబ్లీలో ఎమ్మెల్యే లు నాగరాజు, గండ్ర సత్యనారాయణను, ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే లక్ష్మణ్ ను, ఎమ్మెల్యే కావ్వంపల్లి ని కాంగ్రెస్ పార్టీ నేత డాక్టర్ పెరుమాండ్ల రామకృష్ణ మర్యాదపూర్వకంగా కలిశారు.
ఈ సమావేశంలో భాగంగా వరంగల్ నుండి ఎంపీ(లోక్ సభ) బరిలో తాను నిలబడే ప్రయత్నం చేస్తున్నట్లు రామకృ ష్ణ తెలిపారు. ఈ సందర్భంగా మంత్రి సీతక్క, ఎమ్మెల్యేల ఆశీస్సులు తీసుకున్నారు. సానుకూలంగా స్పందించిన ఎమ్మెల్యేలకు, మంత్రికి ధన్యవాదాలు చెప్పారు.
ఎంపీ ఆస్పిరెంట్ రామకృష్ణ ఈ సందర్భంగా మాట్లాడుతూ రాబోయే పార్లమెంట్ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థులని ప్రజలు భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు. తాను వరంగల్ ఎంపీ బరిలో నిలబడాలి అంటే..ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆశీస్సులు మంత్రుల ఎమ్మెల్యేల సహకారాలు..అదేవిధంగా ప్రజల ఆశీస్సులు తమపై ఉండాలని తెలిపారు. ప్రజలకు తాను చేసిన సేవే తనను గెలిపిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. రేవంత్ రెడ్డి పరిపాలన చాలా అద్భుతంగా ఉందని, ప్రజలందరికీ తప్పకుండా న్యాయం జరుగుతుందని, రాబోయే రోజులలో కాంగ్రెస్ ప్రభుత్వం పథకాలను విజయవంతంగా పూర్తి చేస్తుందని పేర్కొన్నారు.