వేద న్యూస్, హైదరాబాద్:
డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ తెలంగాణ రాష్ట్ర సచివాలయం హైదరాబాద్ లో వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహా అధ్యక్షతన జీవో ఎంఎస్ నెం. 317 పై ఏర్పడిన క్యాబినెట్ సబ్ కమిటీ సమావేశం మంగళవారం జరిగింది. ఈ కేబినెట్ సబ్ కమిటీ లో సభ్యులుగా ఉన్న రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు, రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, వివిధ శాఖల ముఖ్య అధికారులు పాల్గొన్నారు.
క్యాబినెట్ సబ్ కమిటీ 317 జీవో వల్ల ఉద్యోగుల ఉపాధ్యాయుల ఎదుర్కొంటున్న సమస్యల గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు. సమస్యల పరిష్కారానికి ప్రజా ప్రభుత్వం ముందుకు వచ్చిందని తెలిపారు. సబ్ కమిటీ చైర్మన్, రాష్ట్ర మంత్రి దామోదర రాజనర్సింహా, కమిటీ సభ్యులు, మంత్రులు శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్ జీవోలోని లోటుపాట్లను సరిదిద్దేందుకు ఉద్యోగ సంఘాలతో సమావేశం కావాలని నిర్ణయించారు.
జీవో నెంబర్ లు 317, 46 ల వల్ల ఉద్యోగులు, ఉపాధ్యాయుల సమస్యలపై, పలు అంశాలపై అధ్యయనం చేసి పరిష్కారానికి కృషి చేయాలని క్యాబినెట్ సబ్ కమిటీ సభ్యులు ఉన్నతాధికారులను ఆదేశించారు. జీవో నెంబర్లు 317, 46లోని లోటుపాట్లు, పలు అంశాలపై లోతుగా అధ్యయనం చేసి పలు విషయాలపై సమావేశంలో చర్చించారు.