వేద న్యూస్, వరంగల్ క్రైమ్: 

ఉమ్మడి వరంగల్ ఖమ్మం నల్గొండ పట్టభద్రుల  ఎమ్మెల్సీ కి సోమవారం జరిగిన ఎన్నికల  పోలింగ్ కేంద్రాలను వరంగల్ పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ పరిశీలించారు. ఈ సందర్బంగా పోలీస్ కమిషనర్ ఆత్మకూరు మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల లో ఏర్పాటు చేసిన పోలింగ్ తో పాటు మట్టేవాడ, హనుమకొండ పోలీస్ స్టేషన్ల పరిధిలోని ఇస్లామియా కాలేజీ, కాకతీయ ప్రభుత్వ డిగ్రీ కళాశాల్లో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రాలను  క్షేత్ర స్థాయిలో పరిశీలించారు. ఈ సందర్బంగా పోలింగ్ కేంద్రాల్లో పోలీస్ బందోబస్తూ తో పాటు పోలింగ్ జరుగుతున్న తీరును పోలీస్ కమిషనర్ స్థానిక పోలీస్ అధికారులతో పాటు, పోలింగ్ కేంద్రం ఎన్నికల అధికారిని అడిగి తెలుసుకున్నారు.