వేద న్యూస్, డెస్క్:

టీజీపీఎస్సీ ముట్టడిలో అరెస్టయిన నిరుద్యోగ యువతను పరామర్శించడానికి గోషామహల్ స్టేడియంకు వెళ్లిన  బీఆర్ఎస్ నేత రాకేష్ రెడ్డి ని పోలీసులు అడ్డుకున్నారు. రాకేష్ రెడ్డిని అరెస్టు చేసేందుకు యత్నించిన పోలీస్ అధికారులపై ఉస్మానియా విద్యార్థి నేతలు, నిరుద్యోగులు ఫైర్ అయ్యారు. తమకు అండగా నిలిచే వాళ్లను నిలువరించే హక్కు మీకెక్కడిదని పోలీసులతో వాగ్వాదానికి ఉస్మానియా విద్యార్థి నేతలు, నిరుద్యోగులు దిగారు. దీంతో శుక్రవారం గోషామహల్ స్టేడియం వద్ద తీవ్ర ఉద్రిక్తత నెలకొంది.