Oplus_16908288
  • 13 ఏండ్ల తర్వాత పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం
  • ఆ”నాటి” జ్ఞాపకాలను గుర్తు చేసుకుని కేరింతలు
  • ఉపాధ్యాయులకు స్టూడెంట్స్ ఘన సన్మానం

వేద న్యూస్, జమ్మికుంట:

“ఎక్కడో పుట్టి..ఎక్కడో పెరిగి ఇక్కడే కలి శాము.. చదువుల మ్మ చెట్టు నీడలో..” అనే పాట పాడుకుంటూ.. ఆ నాటి మధుర జ్ఞాపకాలను..2011-2012 బ్యాచ్ పదో తరగతి పూర్వ విద్యార్థులు గుర్తు చేసుకున్నారు.

ఆదివారం జమ్మికుంట మండలంలోని తనుగుల గ్రామంలో సుమారు 13 సంవత్సరాల తర్వాత ఒకే వేదికపై కలుసుకొని ఆత్మీయ సమ్మేళనం ఘనంగా జరుపుకున్నారు. సోషల్ మీడియా, వాట్సాప్ గ్రూప్ ద్వారా కలుసుకొని ఒకరికొకరు ఆలింగలనం చేసుకొని ఆత్మీయత పంచుకొని అందంగా గడిపారు.

ఇన్ని రోజులు ఎక్కడో ఉన్నారో తెలియదు ,ఊరుకోకరు ఉద్యోగరీత్యా, కుటుంబ బాంధవ్యాల రిత్యా, బాధ్యతతో సతమతమయ్యే మిత్రులంతా 13 సంవత్సరాల తర్వాత కలుసుకొని ఒకరి బాధలు ఒకరు కష్టసుఖాలు తెలుసుకున్నారు.

“స్నేహమేరా జీవితం… స్నేహమేరా శాశ్వతం” అంటూ కేరింతలు కొడుతూ ఆటపాటలతో డ్యాన్సులతో అదరగొట్టేశారు. జన్మనిచ్చినది తల్లిదండ్రులైతే.. తప్పుడు మార్గంలో నడవకుండా బెత్తముతో దండించి తలపై మొట్టికాయలు వేసి విద్యాబుద్ధులు నేర్పిన సమాజంలో మంచి మార్గంలో నడవడానికి మార్గం చూపెట్టి జీవితానికి అర్థం చెప్పిన అప్పటి గురువుల (ఉపాధ్యాయుల) అడ్రస్ తెలుసుకొని స్కూలుకు రప్పించుకొని శాలువాతో సత్కరించి, జ్ఞాపికలు అందజేసి విద్యార్థులంతా కలిసి ఘనంగా సన్మానించారు.

ఈ సందర్భంగా ఆనాటి జ్ఞాపకాలు నెమరు వేసుకొని ఆడిన ఆటలు ,పాడిన పాటలు చిలిపి చేష్టలు గుర్తుచేసుకొని ఆనందంగా గరిపారు. చదివిన స్కూల్ రూమ్స్ పాఠశాల ఆవరణ కలియచూసుకొని మురిసిపోయారు.

కార్యక్రమంలో ఉపాధ్యాయులు ,ఆకినపెళ్లి వెంకటేశ్వర్లు, మంగళపల్లి సంపత్, చెన్న బోయిన సమ్మయ్య,మారేపల్లి విజయ కుమారి, పూర్వ విద్యార్థులు బిజిగిరి సాయినాథ్, జూపాక శ్యామ్, వంశీ, సందీప్, గోనే ప్రశాంత్, రుద్రవరం అనూష, ఇంగే వనిత, స్వప్న, వరలక్ష్మి, గిరిబాబు, వంశీకృష్ణ, మారేపల్లి ప్రశాంత్, శ్రీకాంత్, సుమంత్, మహేష్, తోట లావణ్య, జ్యోత్స్న, స్వప్న, భార్గవి, రమ్య అనుముల శ్రీకాంత్ తిరుమల రావు, బెజ్జాల వేణు, జంపయ్య, జై ద రాజేష్ బొల్లి శేఖర్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *