వేద న్యూస్, శాయంపేట:
భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు ఆదేశాల మేరకు బుధవారం కాంగ్రెస్ పార్టీ గ్రామ కమిటీలను ఎన్నుకున్నట్లు కమిటీ ఇన్ చార్జీ లు మాజీ ఎంపీటీసీ కొమ్ముల భాస్కర్, మామిడిపల్లి సాంబయ్య ,పరకాల వ్యవసాయ కమిటీ వైస్ చైర్మన్ మారపల్లి రవీందర్ తెలిపారు. శాయంపేట గ్రామ కాంగ్రెస్ అధ్యక్షునిగా మారేపల్లి రాజు, ఉపాధ్యక్షుడిగా కోల శ్రీనివాస్ , బాసని చంద్రమౌళి, ప్రధాన కార్యదర్శిగా మామిడి సుదర్శన్, కార్యదర్శులుగా బేర్గు సతీష్ , బొల్లపెల్లి సదానందం, కోశాధికారిగా అల్లే శంకర్, ప్రచార కార్యదర్శిగా వలుపదాసి వెంకటరమణను లను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.
మహిళా విభాగంలో గ్రామ మహిళా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలుగా వలపదాసు శ్వేత ,ఉపాధ్యక్షురాలుగా మారపల్లి జ్యోతి ,ప్రధాన కార్యదర్శిగా మారపల్లి కళ్యాణి, కార్యదర్శిగా ఎండి జేబూన్, ప్రచార కార్యదర్శిగా రంగు స్వాతి లను ఎన్నుకున్నారు.
ఈ సందర్భంగా మారపెల్లి రాజు మాట్లాడుతూ శాయంపేట కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి కృషి చేస్తానని వచ్చే స్థానిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలుపు లక్ష్యంగా పనిచేస్తానని చెప్పారు. కార్యక్రమంలో దామెరకొండ కొమురయ్యా,బాసాని మార్కండేయ ,బాసాని రవి, మారపల్లి రంగు బాబు ,మారపల్లి కట్టయ్య , ఐ ఎన్ టి యు సి మండల అధ్యక్షుడు మారపల్లి రాజేందర్ ,చింతల రవిపాల్, ప్రపంచ రెడ్డి ,ఎండి రఫీ ,యూత్ మండల అధ్యక్షుడు సాదు నాగరాజు ,వడ్డేపల్లి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.