వేద న్యూస్, ప్రతినిధి సూర్యాపేట:

గత 26 సంవత్సరాలుగా ఐసిడిఎస్ అంగన్వాడి టీచర్ గా విధులు నిర్వహించిన సరోజినీ శుక్రవారం పదవి విరమణ చేశారు.శుక్రవారం చివ్వెంల మండలం దురాజ్ పల్లి సెక్టార్ కుడకుడ అంగన్వాడి సెంటర్ 1 లో ఆమెను తోటి అంగన్వాడీ టీచర్లు ఘనంగా సన్మానించారు.ఈ వేడుకలకు ముఖ్య అతిథులుగా హాజరైన పలువురు ప్రముఖులు మాట్లాడుతూ వివిధ ప్రభుత్వ శాఖలలో విధులు నిర్వహించే ఉద్యోగులకు ఉద్యోగ పదవి విరమణ సహజమని అన్నారు.ఈ కార్యక్రమంలో సిడిపిఓ శ్రీవాణి,ఏసిడిపిఓలు సాయిగీత,సూపర్వైజర్లు సునీత,శ్రీదేవి,దురాజ్ పల్లి సెక్టర్ అంగన్వాడి టీచర్లు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *