వేద న్యూస్, శాయంపేట:

శాయంపేట మండలంలోని శాయంపేట గ్రామంలో గల సాయి ఫెర్టిలైజర్స్ అండ్ పెస్టిసైడ్స్ షాపును మండల వ్యవసాయ అధికారి గంగజమున తనిఖీ చేశారు. లైసెన్స్ , పలు రికార్డులను పరిశీలించి నకిలీ విత్తనాలు, లూజుగా అమ్మే విత్తనాలను వ్యాపారం చేయకూడదని సూచించడం జరిగింది, రిజిస్టర్లు బిల్లు బుక్కులను రైతు వారిగా విక్రయాల వివరాలతో కూడినటువంటి రిజిస్టర్లను తప్పనిసరిగా ఉండాలని సూచించడం జరిగింది, రైతులు అధికృత డీలర్ వద్దనే విత్తనాలు కొనుగోలు చేయాలి,బిల్లు రసీదులను కచ్చితంగా తీసుకోవాలి, రసీదుల మీద షాపు యజమాని , రైతు యొక్క సంతకం తప్పనిసరిగా ఉండాలి.

ఈ  బిల్లును రైతులు పంట కాలం అయిపోయే వరకు కూడా భద్రపరుచుకోవాలని సూచించారు. రైతులు తమకు నచ్చిన రకాన్ని ఎంచుకొని సాగుచేసుకొనవచ్చు, మంచి యాజమాన్య పద్ధతులను పాటించినట్లయితే అధిక దిగుబడులు కూడా సాధించవచ్చు అని తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *