- రెండో విడత డిగ్రీ అడ్మిషన్లు కంటిన్యూ
వేద న్యూస్, జమ్మికుంట:
జమ్మికుంట పట్టణంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో 2025-26 విద్యా సంవత్సరానికి.. రెండో విడత డిగ్రీ అడ్మీషన్లు కొనసాగుతున్నాయని ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ డా.బి. రమేష్ సోమవారం తెలిపారు. దోస్త్ లో జూన్ 8 వరకు రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చని చెప్పారు.
అదే విధంగా జమ్మికుంట ప్రభుత్వ డిగ్రీ కళాశాలకు వెబ్ ఆప్షన్లు ఇవ్వాలని విద్యార్థులను కోరారు. బీఎస్ బీజెడ్సీ, బీజెడ్సీఎస్, క్రాప్ ప్రొడక్షన్, డైరీ సైన్స్, ఎంపీసీఎస్, బీఏ హెచ్ఈపీ, కంప్యూటర్ సైన్స్, ఆఫీస్ మేనేజ్మెంట్, బీకాం వంటి కోర్సుల్లో సీట్లు అందుబాటులో ఉన్నాయని పేర్కొన్నారు. కళాశాలలో అడ్మిషన్లపై ఏదైనా సందేహలు ఉంటే కళాశాల దోస్త్ కో- ఆర్డినేటర్ ఎల్. రవీందర్ సెల్ 94911 14511, 9849689956 నంబర్ లలో సంప్రదించాలని సూచించారు.