వేద న్యూస్, జమ్మికుంట:
జమ్మికుంట ప్రభుత్వ డిగ్రీ కళాశాలకు దోస్త్ (DOST) హెల్ప్ లైన్ సెంటర్ మంజూరయిందని కళాశాల ప్రిన్సిపాల్ డా.బి. రమేష్ తెలిపారు. డిగ్రీ అడ్మీషన్ల కోసం దోస్త్ ద్వారా ఆన్లైన్ లో దరఖాస్తు చేసుకునేటప్పుడు సాంకేతికమైన సమస్యలు, దరఖాస్తు పరమైన సమస్యలు, వెబ్ ఆప్షన్ల వంటి సమస్యలు తలెత్తినప్పుడు దోస్త్ హెల్ప్ లైన్ ద్వారా పరిష్కరిస్తామన్నారు.
గ్రామీణ ప్రాంత విద్యార్థుల సౌకర్యార్థం కోసం కళాశాల విద్యశాఖ కమిషనరేట్ అధికారులకు విజ్ఞప్తి చేయగా, అధికారులు వెంటనే స్పందించి జమ్మికుంట ప్రభుత్వ డిగ్రీ కళాశాలకు దోస్త్ హెల్ప్ లైన్ సెంటర్ మంజూరు చేశారని, హెల్ప్ లైన్ సెంటర్ ను మంజూరు చేసిన కళాశాల విద్యాశాఖ కమిషనర్ దేవసేనకు, కళాశాల విద్య శాఖ జాయింట్ డైరెక్టర్లు డా. రాజేంద్రసింగ్, డా. బాల భాస్కర్ కు కృతజ్ఞతలు తెలిపారు.
కరీంనగర్ జిల్లాలోనే SRR ప్రభుత్వ డిగ్రీ అండ్ పీజీ కళాశాల తర్వాత జమ్మికుంట ప్రభుత్వ డిగ్రీ కళాశాలకే దోస్త్ హెల్ప్ లైన్ మంజూరు చేశారని చెప్పారు. గతంలో ఏ సమస్య వచ్చినా విద్యార్థులు కరీంనగర్ లేదా హనుమకొండ వేళ్ళేవారని, ఇప్పుడు విద్యార్థులకు ఆ సమస్య లేదన్నారు.
డిగ్రీ అడ్మీషన్ల కోసం దరఖాస్తు చేసుకునే విద్యార్థులకు దోస్త్ ఆన్ లైన్ లో దరఖాస్తు స్వీకరణ, వెబ్ ఆప్షన్ల నమోదులో ఎలాంటి సమస్యలు తలెత్తిన కళాశాలలోని దోస్త్ కో-ఆర్డినేటర్ ఎల్. రవిందర్, టెక్నికల్ అసిస్టెంట్ శ్రీకాంత్ లను 9491114511, 9949494549, 9849689956 నంబర్లలో సంప్రదించగలరని పేర్కొన్నారు. గ్రామీణ ప్రాంత విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు