- జమ్మికుంట ప్రభుత్వ డిగ్రీ కాలేజీ ప్రిన్సిపాల్ డా.బి.రమేష్
వేద న్యూస్, జమ్మికుంట:
ప్రకృతి, పర్యావరణాన్ని పరిరక్షించుకోవాలని జమ్మికుంట ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ డా.బి. రమేష్ అన్నారు. కళాశాలలో ప్రిన్సిపాల్ అధ్యక్షతన కళాశాల సైన్స్ విభాగాల ఆధ్వర్యంలో ప్రపంచ పర్యావరణ దినోత్సవం పురస్కరించుకొని గురువారం ప్రకృతి పర్యావరణంపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు.
ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ మాట్లాడుతూ ప్రపంచ ఐక్యరాజ్య సమితి ఈ సంవత్సరాన్ని “ప్లాస్టిక్ కాలుష్య నియంత్రణ” సంవత్సరంగా నిర్ణయించారని తెలిపారు. ప్లాస్టిక్ వాడకాన్ని నియంత్రించాలన్నారు. ప్రకృతి పర్యావరణం పైనే మానవ మనుగడ నెలకొందన్నారు. పర్యావరణ సమతౌల్యం లోపిస్తుండడం వల్ల ప్రకృతి వైపరిత్యాలు సంభవిస్తున్నాయన్నారు. పర్యావరణాన్ని పెంపొందించుకోవాలని సూచించారు.
కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపాల్ డా.ఎస్. ఓదెలు కుమార్, సైన్స్ విభాగాల అధ్యాపకులు డా.కె. గణేష్, సి. రాజకుమార్, వి. కిరణ్ కుమార్, మమత, సాయికుమార్, అరుణ్ రాజ్ రమేష్, విద్యార్థిని, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.