వేదన్యూస్ – ఈడెన్ గార్డెన్స్
ఐపీఎల్ -2025 సీజన్ లో భాగంగా కోల్ కత్తా నైట్ రైడర్స్ జట్టు తో జరుగుతున్న మ్యాచ్ లో లక్నో సూపర్ జెయింట్స్ ఆటగాళ్లు విధ్వంసం సృష్టించారు. పూర్తి 20 ఓవర్లు ఆడి మొత్తం 238 పరుగులు చేశారు.
లక్నో జట్టుకు చెందిన ఓపెనర్ మార్ష్ 48 బంతుల్లో 5 సిక్సర్లు, 6 ఫోర్లతో 81 చేశారు. చివర్లో పూరన్ 36 బంతుల్లోనే 8 సిక్సర్లు, 7 ఫోర్లతో 87* చేసి ఊచకోత కోశారు.. ఓపెనర్ మార్క్రమ్ 47 పరుగులతో రాణించారు.
మరోవైపు కేకేఆర్ జట్టు బౌలర్లు హార్షిత్ రానా 51/2 (4ఓవర్లు), రసూల్ 32/1(2 ఓవర్లు), వరుణ్ చక్రవర్తి 31(4 ఓవర్లు) ధారళంగా పరుగులు సమర్పించుకున్నారు.