వేద న్యూస్, రుద్రూర్ :

 

రుద్రూర్ మండల కేంద్రంలోని పోలీస్ స్టేషన్ లో శుక్రవారం సాయంత్రం పోలీసు సిబ్బంది పై దురుసుగా ప్రవర్తించి, ఏఎస్ఐ రేణుకా దేవి విధులకు ఆటంకం కలిగించి, దుర్భాషలాడిన ముగ్గురు వ్యక్తులకు ఏఎస్సై ఫిర్యాదు పై ఎస్సై మనోజ్ కుమార్ కేసు నమోదు చేసి రిమాండ్ కు తరలించారు. ఈ మేరకు అడిషనల్ జడ్జి ఇ. సాయిశివ ముగ్గురు వ్యక్తులకు ఆరు రోజుల పాటు జైలు శిక్ష విధించారు. మండలంలో శాంతి భద్రతలకు ఎటువంటి విఘతం కలిగించిన, పోలీసుల పట్ల అనుచితంగా ప్రవర్తించిన వారి పై చట్టపరమైన చర్చలు తీసుకుంటామని ఎస్సై మనోజ్ కుమార్ తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *