క్రికెట్ మ్యాచ్ లను ప్రారంభించి జిల్లా ఎస్పీ..


వేద న్యూస్, రాజన్న సిరిసిల్ల జిల్లా:

జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రెండ్లి క్రికెట్ మ్యాచ్ లలో పోలీస్ ఎ టీమ్ వి ఎస్ సిరిసిల్ల ప్రెస్ టీమ్ మరియు పోలీస్ బి టీమ్ వి ఎస్ వేములవాడ ప్రెస్ టీమ్ ల మద్య ఉత్సాహంగా కొనసాగిన క్రికెట్ పోటీలు.శనివారం రోజున జిల్లాలోని స్థానిక కళాశాల మైదానంలో పోలీస్ మరియు ప్రెస్ మధ్య జరిగిన ఫ్రెండ్లీ క్రికెట్ మ్యాచ్ లను జిల్లా ఎస్పీ ప్రారంభించారు.మొదటగా పోలీస్ ఎ టీమ్ మరియు సిరిసిల్ల ప్రెస్ మధ్య జరిగిన మ్యాచ్ లో పోలీస్ ఎ టీమ్ గెలుపొందగా ,రెండవ మ్యాచ్ లో పోలీస్ బి టీమ్ మరియు వేములవాడ ప్రెస్ మధ్య జరుగగా వేములవాడ ప్రెస్ టీమ్ గెలుపొందగా ఫైనల్ మ్యాచ్ పోలీస్ ఎ టీమ్ మరియు వేములవాడ ప్రెస్ టీమ్ అడగా మొదట బ్యాటింగ్ చేసిన పోలీస్ ఎ టీమ్ నిర్ణిత 10 ఓవర్లలో 77 పరుగులు చేయగా వేములవాడ ప్రెస్ జట్టు నిర్ణిత 10.ఓవర్లలో 73 పరుగులు చేయగా పోలీస్ ఎ టీమ్ 4 పరుగుల తేడాతో గెలుపొందడం జరిగింది.
మొదటి ప్లేస్ పోలీస్ ఎ టీమ్.రెండవ ప్లేస్ వేములవాడ ప్రెస్ టీమ్.మూడవ ప్లేస్ సిరిసిల్ల ప్రెస్ టీమ్.అనంతరం జట్ల సభ్యులకు జిల్లా ఎస్పీ బహమతులు అందించారు.ఈసందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.క్రీడలతో మానసిక ఉల్లాసం పెంపొందుతుందని నిత్యం బిజీగా ఉండే పోలీసులు, జర్నలిస్టులు కొంత సేపు ఆహ్లాదకరంగా గడిపారు అని అన్నారు. ప్రెస్, పోలీసుల మధ్య మంచి సస్సబంధాలు ఉండడానికి ఫ్రెండ్లీ క్రికెట్ మ్యాచ్ నిర్వహించడం జరిగిందని. ప్రతి సంవత్సరం ఒక సారి ఈ విధంగా క్రికెట్ మ్యాచ్ నిర్వహించడం ద్వారా ప్రతి ఒక్కరికీ ఆటవిడుపుతో పాటు మంచి టీమ్ స్పిరిట్ వస్తుందని అభిప్రాయపడ్డారు.క్రికెట్ మ్యాచ్ ప్రారంభించే ముందు సిరిసిల్ల టీవి 9 రిపోర్టర్ ప్రసాద్ ఇటీవల గుండెపోటుతో మరణించగా 2 నిమిషాలు మౌనం పాటించి నివాళులుఅర్పించారు.ఈకార్యక్రమంలోపోలీస్అధికారులు,పాత్రికేయులు,పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.