వేద న్యూస్, రుద్రూర్ :
ఉగాది పండుగను పురస్కరించుకుని రుద్రూర్ మండలంలోని అంబం(ఆర్) గ్రామంలో గురువారం కాషాయ ధ్వజ ఆవిష్కరణ చేశారు. అనంతరం ఉగాది పచ్చడి పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ కుర్లేపు గంగాధర్, ఉప సర్పంచ్ రేపల్లి సాయి ప్రసాద్, యువకులు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.