• సంక్షేమంలో తెలంగాణే నెం.1
  • ప్రజలందరూ గులాబీ పార్టీ వైపే
  • పెద్దపల్లి ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి ధీమా 

వేద న్యూస్, పెద్దపల్లి/ఎలిగేడు:
పెద్దపల్లి జిల్లా జూలపల్లి మండలం కుమ్మరికుంట గ్రామంలో మంగళవారం ఎమ్మెల్యే, బీఆర్ఎస్ అభ్యర్థి దాసరి మనోహర్ రెడ్డి గడపగడపకు వెళ్లి ప్రచారం చేశారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను, నియోజకవర్గంలో జరిగిన అభివృద్ధి పనులను వివరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అధికారంలో ఉన్నప్పుడు ఏం చేశారని ప్రజలు మరోసారి నమ్మి ప్రతిపక్షాలకు ఓట్లు వేస్తారని అడిగారు. మూడోసారి ముఖ్యమంత్రిగా కేసీఆర్ ప్రమాణ స్వీకారం చేయడం ఖాయమని, పెద్దపల్లి లో సైతం గులాబీ జెండా ఎగురుతుందని ధీమా వ్యక్తం చేశారు.

వారంటీ లేని పార్టీ ఆరు గ్యారెంటీలు ఇచ్చినా, 60 గ్యారంటీలు ఇచ్చినా ప్రజలు కాంగ్రెస్ పార్టీని నమ్మే పరిస్థితి లేదన్నారు. సంక్షేమ పథకాల అమలులో దేశంలోని తెలంగాణ నంబర్ వన్ స్థానంలో ఉందని, ప్రపంచంలో ఎక్కడా కూడా కేసీఆర్ అందిస్తున్న పథకాలు లేవని వెల్లడించారు. రైతుబంధు, రైతు బీమా, కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్, దళిత బంధు, బీసీ బందు, మైనార్టీ బందు, కెసిఆర్ కిట్టు, జిల్లాకు ఓ మెడికల్ కాలేజీ అంటివి ఒక్కటి కూడా కాంగ్రెస్, బిజెపి పాలిత రాష్ట్రాల్లో లేవన్నారు. నియోజకవర్గాన్ని మరింత అభివృద్ధి చేస్తామని రాబోయే ఎన్నికల్లో కారు గుర్తుకు ఓటు వేసి మరోసారి ప్రజలు అండగా నిలవాలని అభ్యర్థించారు.

ఇంటింటా ప్రచారంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ రఘువీర్ సింగ్, ఎంపీపీ కూసుకుంట్ల రమాదేవి – రాంగోపాల్ రెడ్డి, జడ్పీటీసీ బొద్దుల లక్ష్మణ్, మండల పార్టీ అధ్యక్షులు కంది చొక్కారెడ్డి ,వైస్ ఎంపీపీ మొగురం రమేష్, రైతు సమితి మండల కో ఆర్డినేటర్ వీసారపు వెంకటేశం,అనుబంధ సంఘాల అధ్యక్షులు కత్తెర్ల శ్రీనివాస్, తమ్మడవేణి మల్లేశం, లక్ష్మీ నర్సయ్య,సీనియర్ నాయకులు చాతర్ల కాంతయ్య, కన్వీనర్ కుంట రాజేశ్వర్ రెడ్డి ,సర్పంచ్ సంతోష్ రావు,ఉప సర్పంచ్ కొత్త మల్లేశం , గడ్డం రాజేశ్వర్ రెడ్డి, నల్లతీగల సతీష్ ,గ్రామ శాఖ అధ్యక్షులు కొత్త శ్రీధర్,రైతు సమితి సూర ప్రభుదాస్,కామరాజు, వెంకటేశం,తిరుపతి,సత్తయ్య,కొత్త రాజు, కొండయ్య, అనిల్, తేజ, గోపాల్, జగన్, శ్రీనివాస్, స్వామి , సంపత్, సుదర్శన్, పోచయ్య,రజవెల్లి, ప్రభాకర్, గంగయ్య,మల్లేశం, సాదుల రాజయ్య,రాజు, కొప్పుల శ్రీధర్, యోసఫ్, కొప్పుల అజిత్, లక్ష్మణ్, తమ్మడవేణి శ్రావణ్ ,మండల సర్పంచ్ లు, ఎంపీటీసీ లు,భారత రాష్ట్ర సమితి ప్రజా ప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.