వేద న్యూస్, డెస్క్ : 

సిద్దిపేట జిల్లా కలెక్టర్ గన్‌మెన్‌గా పని చేస్తోన్న ఏఆర్ కానిస్టేబుల్ ఆకుల నరేష్ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మొదట భార్య, ఇద్దరు పిల్లలను గన్‌తో కాల్చి.. అనంతరం అతడు అదే గన్‌తో కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.

మెదక్ జిల్లాలోని చిన్నకోడూర్ మండలం రామునిపట్ల గ్రామంలో ఈ ఘటన చోటు చేసుకుంది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని వివరాలు సేకరిస్తున్నారు. కానిస్టేబుల్ నరేష్ ఆత్మహత్యకు గల కారణాలపై ఆరా తీస్తున్నారు. ఆర్థిక వ్యవహరాలే ఆత్మహత్యకు కారణంగా పోలీసులు అనుమానిస్తున్నారు. ఒకేసారి నలుగురు మృతి చెందటంతో రామునిపట్ల గ్రామంలో విషాదం నెలకొంది. కాగా, ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.