వేద న్యూస్, కేయూ:
బాధితుడు పెండెం రాజేందర్ ఫిర్యాదు మేరకు రూ.50 వేలు రూపాయలు లంచం తీసుకుంటుండగా కాకతీయ యూనివర్సిటీ అసిస్టెంట్ రిజిస్ట్రార్ ఏఆర్ కిష్టయ్య ను పట్టుకోవడం జరిగిందని ఏసీబీ డీఎస్పీ సాంబయ్య తెలిపారు. శుక్రవారం కాకతీయ యూనివర్సిటీ లో అసిస్టెంట్ రిజిస్ట్రార్ ఏఆర్ కిష్టయ్య రూ. 50 వేలు లంచం తీసుకుంటుండగా ఏసీపీ అధికారులు ట్రాప్ చేసి పట్టుకున్నారు.
అయితే విద్యార్థుల ట్యూషన్ ఫీజులు, ఇతర రుసుముల స్వీకరణలో జరిగిన రూ.3 కోట్ల కుంభకోణంపై ఏఆర్ కిష్టయ్య, ప్రిన్సిపాల్ బన్న అయిలయ్య పై కమిటీ విచారణ చేస్తున్న సయమంలోనే వీసీ రమేష్ కిష్టయ్యను క్యాంపస్ కు మార్చారు. న్యాక్ కోసం కేటాయించిన రూ.10 కోట్ల బిల్లుల్లో చేతి వాటం కోసమే కిష్టయ్యను క్యాంపస్ కు వీసీ బదిలీ చేయించారని గతంలో అనేక ఆరోపణలు సైతం వచ్చాయి.
యూనివర్సిటీ లో కీలకైన నాలుగు కార్యాలయాలకు కిష్టయ్య ను ఒక్కడినే అసిస్టెంట్ రిజిస్ట్రార్ గా వీసీ నియమించారనే ఆరోపణలు సైతం ఉన్నాయి. న్యాక్ సందర్భంగా వర్సిటీలో రోడ్లు, హాస్టళ్లు, ఇతర బిల్డింగ్ ల కోసం రూ.10 కోట్ల కేటాయించారు. వీటిలో కమీషన్ల కోసమే బిల్డింగ్ డివిజన్, పబ్లికేషన్స్ సెల్, హాస్టల్ ఆఫీస్ తో పాటు యూనివర్సిటీ ఆడిట్ ఆఫీస్ కు కూడా కిష్టయ్య నే అసిస్టెంట్ రిజిస్ట్రార్ గా నియమించారు.
ఒక్క హాస్టల్ లోనే పాలు అమ్మే వ్యాపారి దగ్గరి నుంచి రూ.50 వేలు లంచం తీసుకోవడం పలు అనుమానాలకు తావిస్తోంది. అయితే ఇంకా దీని వెనుక పెద్ద పెద్ద తిమింగలాలు ఉన్నాయనే అనుమానంతో ఏసీబీ విచారణ జరుపుతోంది. బిల్లులు తయారు చేసేదీ తానే…ఆ బిల్లులు పాస్ చేసేది తానే కావడంతో ఏ.ఆర్ కిష్టయ్య చేతి వాటానికి అంతు లేకుండా పోయిందనే అరోపణలు లేకపోలేదు..చూడాలి మరీ ఏసీబీ అధికారులు పూర్తిస్థాయిలో విచారణ చేపట్టి దీని వెనుక ఉన్న తిమింగలాలను పట్టుకుంటారో లేదో..?