• అధిక సంఖ్యలో పాల్గొన్న భక్తులు

వేద న్యూస్, ఎలిగేడు:
పెద్దపెల్లి జిల్లా ఎలిగేడు మండల పరిధిలోని లాలపల్లి గ్రామంలో సోమవారం మల్లికార్జున స్వామి లగ్న పట్న కార్యక్రమం అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఒగ్గు పూజారుల నృత్యాలు అందరినీ అలరించాయి. కార్యక్రమంలో గ్రామ ప్రజలు బోనాలు చేసి మల్లికార్జున స్వామికి నైవేద్యం సమర్పించారు.

 

మల్లిఖార్జున స్వామిని దర్శించుకునేందుకు భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు గుర్రం మల్లారెడ్డి, సామ రాజేశ్వర్ రెడ్డి, బద్దం మల్లారెడ్డి, పెద్ది రాజేశం, ఏలేటి మల్లారెడ్డి, గడ్డం శ్రీనివాస్ రెడ్డి, సర్పంచ్ సింగిరెడ్డి ఎల్లవా, నాయకులు శ్రీనివాస్ రెడ్డి, మైపాల్ రెడ్డి, తిరుపతి రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.