- భక్తులకు అన్నదానం
వేద న్యూస్, ఆసిఫాబాద్:
కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లా రెబ్బన మండలం ఇందిరానగర్ గ్రామంలో వెలసిన శ్రీ కనక దుర్గాదేవి స్వయంభూ శ్రీ మహంకాళీ అమ్మవారికి ఆలయంలో భక్తులు ఆదివారం మొక్కులు సమర్పించుకున్నారు. అమ్మ వారిని దర్శించుకున్న అనంతరం భక్తులు వొడి బియ్యలు, నైవేద్యాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు.
వొడి బియ్యాలు, నైవేద్యాలు అమ్మవారికి సమర్పించి..భక్తులు పూజించారు. అనంతరం వచ్చిన భక్తులకు ఆలయ అర్చకులు దేవర వినోద్, ఆలయ కమిటీ అద్యక్షుడు మోడెమ్ తిరుపతి గౌడ్ అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. స్వయంగా అర్చకులు, ఆలయ కమిటీ అధ్యక్షులు భక్తులకు భోజనాలు వడ్డించారు.