వేద న్యూస్, కరీమాబాద్ :
దేశవ్యాప్తంగా 75వ గణతంత్ర దినోత్సవ వేడుకలు శుక్రవారం ఘనంగా జరిగాయి. ప్రతి చోటా త్రివర్ణ పతాకం రెపరెపలాడుతుంది. వరంగల్ తూర్పు నియోజకవర్గంలోని 40వ డివిజన్ కరీమాబాద్ లో రిపబ్లిక్ డే వేడుకలను స్ధానిక యువకులు ఘనంగా నిర్వహించారు. త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం పలువురికి చాక్లెట్లు,బిస్కెట్లు పంపిణీ చేశారు.