వేద న్యూస్, ఎలిగేడు:

పెద్దపల్లి జిల్లా ఎలిగేడు మండలం లాలపల్లి గ్రామంలో సోమవారం ధ్వజస్తంభ పునర్నిర్మాణ కార్యక్రమం అంగరంగ వైభవంగా గ్రామ ప్రజల సమక్షంలో నిర్వహించారు. కోరిన కోరికలు తీర్చే లాలపల్లి శ్రీ మల్లికార్జున స్వామి కి ధ్వజస్తంభన నిర్మాణంకి అనేకమంది దాతలు ముందుకు వచ్చి సహాయం చేయడం వల్ల పునర్నిర్మాణ కార్యక్రమం చేపట్టడం జరిగింది . అనంతరం ఆలయ ప్రాంగణంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు.

కార్యక్రమంలో ఆలయ కమిటీ చైర్మన్ కొప్పర రాజేశ్వర్ రెడ్డి, ,వైస్ ఛైర్మన్ మామిడి దెల్లేశ్వర్ రెడ్డి , క్యాషియర్ చిగుర్ల రాములు,సభ్యులు తిపిరెడ్డి రాజేశ్వర్ రెడ్డి, తిపిరెడ్డి మల్లారెడ్డి, కోమటిరెడ్డి హనుమంత రెడ్డి, ఏలిటి మల్లారెడ్డి ,నాయకులు కళ్లెం శ్రీనివాస్ రెడ్డి , సామ రాజేశ్వర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు