వేద న్యూస్, వరంగల్ :

శారీర దృఢత్వానికి క్రీడలు ఎంతో ద్రోహదం చేస్తాయని ఆడెపు ఓవర్సీస్ సీఈవో డాక్టర్ ఆడెపు మధుసూదన్ అన్నారు. వేసవికాలం సందర్భంగా బొల్లికుంటలోని వాగ్దేవి ఇంజనీరింగ్ కళాశాలలో విద్యార్థులకు ఆడేపు ఓవర్సీస్ ఆధ్వర్యంలో క్రీడలను నిర్వహించారు. కబడ్డీ, కోకో, క్రికెట్ క్రీడలను పెద్ద ఎత్తున నిర్వహించారు. ఈ క్రీడలలో సుమారు 500 మంది విద్యార్థులు ఆసక్తిగా పాల్గొన్నారు. అనంతరం క్రీడల్లో గెలుపొందిన విద్యార్థులకు ప్రథమ ద్వితీయ, తృతీయ, గెలుపొందిన విద్యార్థులకు బహుమతులను ఆడెపు ఓవర్సీస్ అధినేత డాక్టర్ మధుసూదన్ అందజేశారు.