వేద న్యూస్, వరంగల్ క్రైమ్:
నేటి యువతను మత్తు పదార్థాలకు బానిస కాకుండా కాపాడుకుందామని వరంగల్ పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా అధికారులకు పిలుపునిచ్చారు. తెలంగాణ రాష్ట్ర యాంటీ నార్కోటిక్స్ బ్యూరో అధ్వర్యంలో గంజాయి, కల్తీ కల్లు వినియోగం జరిగే అనర్థాలపై రూపోందిన వాల్ పోస్టర్ను వరంగల్ పోలీస్ కమిషనర్ బుధవారం అధికారులతో కలిసి అవిష్కరించారు. రాష్ట్రంలో గంజాయితో పాటు కల్తీ కల్లు వినియోగం ద్వారా వ్యక్తులతో పాటు సమాజానికి జరిగే నష్టాన్ని తెలిపే రీతి రూపోందించిన ఈ వాల్పోస్టర్లో గంజాయి, కల్తీ కల్లు విక్రయాలకు పాల్పడితే ఫిర్యాదు చేయాల్సిన టోల్ ఫ్రీ నంబర్తో ఈ అవగాహన పోస్టర్లను రూపోందించడం జరిగింది. ఈ సందర్బంగా పోలీస్ కమిషనర్ మాట్లాడుతూ గంజాయి మహమ్మారి యువతను పట్టిపీడిస్తోందని అన్నారు. తద్వారా వారి జీవితాలు విచ్చిన్నం కావడంతో పాటు తల్లిదండ్రులు మానసిక క్షోభకు గురైవుతున్నారని గంజాయి నిర్మూలనకు ప్రజలందరు స్వచ్చందంగా ముందుకు వచ్చి మత్తు పదార్థాల విక్రయాలకు పాల్పడేవారి సమాచారాన్ని ఇవ్వాలని కోరారు. సమాచారం ఇచ్చిన వారి వివరాలు గొప్యంగా వుంచబడుతాయని అదే విధంగా మత్తు పదార్థాల కట్టడి కోసం పోలీస్ అధికారులు మరింత శ్రమించించాల్సిన వుందని అన్నారు. గంజాయి రహిత కమిషనరేట్ మనందరి లక్ష్యమని వరంగల్ పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా అధికారులకు సూచించారు. ఈ కార్యక్రమములో పరిపాలన అదనపు డిసిపి రవి, ట్రైనీ ఐ.పి.ఎస్ శుభం నాగ్, వరంగల్ పోలీస్ కమిషనరేట్ యాంటీ నార్కోటిక్స్ బ్యూరో ఏసిపి సైదులు, సిసిఆర్బి ఏసిపి డేవిడ్, యాంటీ నార్కోటిక్స్ బ్యూరో ఇన్స్స్పెక్టర్ సురేష్, సిసిఆర్బి ఇన్స్స్పెక్టర్లు గణేష్,శ్రీధర్ రావు పాల్గోన్నారు.