వేద న్యూస్, ఓరుగల్లు:
పంచాయతీ కార్యదర్శుల సమస్యలపై టీఎన్జీవోస్ హనుమకొండ జిల్లా అధ్యక్షుడు ఆకుల రాజేందర్ ఆధ్వర్యంలో పంచాయతీ కార్యదర్శుల ఫోరం బాధ్యులు హనుమకొండ జిల్లా కలెక్టర్ కు బుధవారం వినతిపత్రం సమర్పించారు. కలెక్టర్ తన పరిధి లోని సమస్యలపై సానుకూలంగా స్పందించారని, రాష్ట్ర స్థాయి సమస్యలను ప్రభుత్వానికి పంపిస్తామని పేర్కొన్నట్టు రాజేందర్ వెల్లడించారు.
ఈ సందర్భంగా ఆకుల రాజేందర్, టీఎన్జీవోస్ బాధ్యులు కలెక్టర్కు పుష్పగుచ్ఛం అందచేసి కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి బైరి సోమయ్య, అసోసియేట్ అధ్యక్షుడు పుల్లూరు వేణు గోపాల్, కోశాధికారి పనికెల రాజేష్, కేంద్ర సంఘం నేతలు శ్యామ్ సుందర్, సారంగపాణి, పంచాయతీ కార్యదర్శుల ఫోరం అధ్యక్షుడు అశోక్, కార్యదర్శి నరేష్ ఇంజపెల్లి, కోశాధికారి రాజు, కేంద్ర సంఘం అసోసియేట్ అధ్యక్షులు రఫీ, వెంకటేశం,శ్రీనివాస్, అర్శం శ్రీనివాస్, వేణు మాధవ్, యాదగిరి, వెంకన్న, కిషోర్, సతీష్, లావణ్య, జిల్లా టీ ఎన్ జీ ఓస్ నేతలు భరత్, ఎర్రాప్రగడ తదితరులు పాల్గొన్నారు.