•   ఆసక్తి ఉన్న పాత్రికేయులందరూ ఆహ్వానితులే: కోఆర్డినేటర్స్

వేద న్యూస్, కాశీబుగ్గ :

వృత్తి నైపుణ్యాన్ని మరింత మెరుగుపరుచుకునేందుకు ఒక్కరోజు జర్నలిజం శిక్షణా తరగతులను ఏర్పాటు చేసినట్టు శిక్షణా శిబిరం కో-ఆర్డినేటర్స్ సీనియర్ జర్నలిస్టులు జక్కుల విజయ్ కుమార్, రాజేందర్ దామెర మంగళవారం ఓ ప్రకటనలో తెలిపారు. జర్నలిజంలో అనుభవం కలిగిన సీనియర్ అధ్యాపకులతో వార్తాకథనాలుపై క్లాసెస్ ఉంటాయని వెల్లడించారు.

వార్తలు, స్టోరీలు, వార్తాసేకరణ, శీర్షికలు, లీడ్, సూపర్ లీడ్, వాక్యనిర్మాణం తదితర అంశాలపై ఈ క్లాసులో చర్చించనున్నట్టు పేర్కొన్నారు. నూతనంగా జర్నలిజంలో వచ్చే వారు, ఇప్పటికే కొనసాగుతున్నావారు, గ్రామీణ, పట్టణ విలేకరులు.. ఆసక్తి ఉన్నవారందరూ ఈ క్లాసెస్‌కు ఆహ్వానితులే అని పేర్కొన్నారు.

ఈ క్లాసులు (జూన్ 4) బుధవారం ఉదయం 10 :30 గంటలకు.. స్కాలర్స్ పబ్లిక్ స్కూల్ కాశీబుగ్గ తిలక్ రోడ్డు, వరంగల్‌లో నిర్వహిస్తున్నామని తెలిపారు. ఆసక్తి ఉన్న వారు వెంటనే 94930 87222,
9849565531 నంబర్లను సంప్రదించొచ్చని స్పష్టం చేశారు.
 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *