వేద న్యూస్, సుల్తానాబాద్:

సుల్తానాబాద్ మున్సిపాలిటీలోని 11వ వార్డులో దాసరి పుష్పలత  ఆదివారం విస్తృత ప్రచారం చేశారు. ప్రజలకు బీఆర్ఎస్ చేసిన సంక్షేమ పథకాలను, అభివృద్ధిని ఇంటింటికి వెళ్లి బొట్టు పెట్టి వివరించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్ పర్సన్ సునీత, కౌన్సిలర్లు, బీఆర్ఎస్ నాయకులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.