TRS Leader Dindigala Rajender

అసెంబ్లీ వర్షాకాల సమావేశాల సందర్భంగా బీఆర్‌ఎస్‌ ప్రజాప్రతినిధులను పోలీసులు అదుపులోకి తీసుకోవడాన్ని నిరసిస్తూ ఇల్లందులో ఆ పార్టీ నాయకులు ఆందోళన నిర్వహించారు.ఇల్లందు పట్టణంలోని కొత్త బస్టాండ్‌ వద్ద డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్‌ విగ్రహం సమీపంలో బీఆర్‌ఎస్‌ నియోజకవర్గ ఇన్‌చార్జ్‌, మాజీ ఎమ్మెల్యే హరిప్రియ నాయక్‌, పార్టీ వ్యవస్థాపక సభ్యుడు దిండిగాల రాజేందర్‌ ఆధ్వర్యంలో నల్ల బ్యాడ్జీలు, నల్ల జెండాలతో నిరసన చేపట్టారు. అసెంబ్లీ సమావేశాలకు నల్ల టీషర్టులతో హాజరైన బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌, ఎమ్మెల్యే హరీశ్‌రావు సహా పలువురు పార్టీ ప్రజాప్రతినిధులను పోలీసులు అదుపులోకి తీసుకున్న తీరును ఈ సందర్భంగా బీఆర్‌ఎస్‌ నాయకులు తప్పుబట్టారు.

మహిళా ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులతో పోలీసులు వ్యవహరించిన తీరుపైనా బీఆర్‌ఎస్‌ నాయకులు ఆరోపణలు చేశారు. ప్రజాప్రతినిధులతో పోలీసులు అనుచితంగా వ్యవహరించారని విమర్శించారు.కాంగ్రెస్‌ ప్రభుత్వ పాలనపై ప్రజా సమస్యలను అసెంబ్లీలో ప్రస్తావించేందుకు బీఆర్‌ఎస్‌ ప్రజాప్రతినిధులు ప్రయత్నించారని, వారి నిరసనను అడ్డుకోవడం సరికాదని హరిప్రియ నాయక్‌, దిండిగాల రాజేందర్‌ పేర్కొన్నారు.

అసెంబ్లీ ప్రాంగణంలో నల్ల దుస్తులతో నిరసన తెలిపే విషయంలో పోలీసులు తీసుకున్న చర్యలను కూడా వారు ప్రశ్నించారు. ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు తమ పార్టీ నిరసనలు కొనసాగిస్తుందని తెలిపారు.ఈ కార్యక్రమంలో బీఆర్‌ఎస్‌ నాయకులు, మాజీ ప్రజాప్రతినిధులు, మహిళా నాయకులు, యువజన విభాగం ప్రతినిధులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *