వేదన్యూస్ హైదరాబాద్
హైదరాబాద్ పోలీసు చరిత్రలో ఒక గొప్ప మైలురాయి నమోదు అయింది. బడుగుల సుమతి ఐపీఎస్ మల్కాజిగిరి పోలీస్ కమిషనర్గా బాధ్యతలు స్వీకరించి, ఈ పదవిని చేపట్టిన తొలి మహిళగా చరిత్ర సృష్టించారు. ఆమె నియామకం తెలంగాణ పోలీస్ వ్యవస్థలో ఒక కొత్త దిశగా నిలిచింది.
2026 ఏప్రిల్ 24న జరిగిన ఐపీఎస్ అధికారుల బదిలీలలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం సుమతిని మల్కాజిగిరి కమిషనర్గా నియమించింది. దాదాపు రెండు శతాబ్దాల చరిత్ర కలిగిన హైదరాబాద్ పోలీస్ వ్యవస్థలో మహిళా నాయకత్వానికి ఇది ఒక గొప్ప గుర్తింపు.
2006 బ్యాచ్ ఐపీఎస్ అధికారి అయిన సుమతి, తన సేవా ప్రయాణాన్ని 2001లో గ్రూప్-1 డీఎస్పీగా ప్రారంభించారు. ఆమె ముందు కమిషనర్గా ఉన్న అవినాష్ మహంతి స్థానంలో బాధ్యతలు చేపట్టారు. సుమతి రాకతో పోలీసింగ్లో మానవీయ దృక్పథం, నూతన ఆలోచనలకు ప్రాధాన్యం పెరుగుతుందని భావిస్తున్నారు.
ఇంటెలిజెన్స్లో విశేష సేవలు :
మల్కాజిగిరికి ముందుగా సుమతి స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్రాంచ్ (SIB)లో ఐజీగా పనిచేశారు. మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో ఆమె చర్చల ద్వారా సమస్యలను పరిష్కరించడంలో కీలక పాత్ర పోషించారు. రెండు సంవత్సరాల్లో 591 మంది మావోయిస్టుల లొంగుబాటుకు దోహదం చేయడం ఆమె కెరీర్లో ఒక గొప్ప విజయంగా నిలిచింది. అలాగే 2026లో ప్రముఖ మావోయిస్టు నాయకుడు తిప్పిరి తిరుపతి (దేవుజి) లొంగుబాటుకు ఆమె చేసిన చర్చలు అత్యంత ప్రాముఖ్యంగా నిలిచాయి. “యూనిఫాం వెనుక మనిషి” అనే భావనతో ఆమె నమ్మకాన్ని పెంచుతూ, శాంతి స్థాపనలో కీలకంగా పనిచేశారు.
టెక్నాలజీ వినియోగంలో ముందంజ :
మెదారం జాతర సమయంలో భారీ జనసందోహాన్ని నియంత్రించేందుకు AI ఆధారిత డ్రోన్ టెక్నాలజీ (TgQuest)ను వినియోగించి, ఆధునిక పోలీసింగ్కు నాంది పలికారు. మహిళా భద్రతపై దృష్టి సీఐడీ మహిళా రక్షణ విభాగంలో డీఐజీగా పనిచేసినప్పుడు “షీ టీమ్స్” కార్యక్రమాన్ని బలోపేతం చేసి, మహిళల భద్రతకు ప్రాధాన్యం ఇచ్చారు.
పురస్కారాలు : 2022లో “విధిష్ట మహిలా పురస్కార్”తో పాటు, గణతంత్ర దినోత్సవ సందర్భంగా “పోలీస్ మెడల్ ఫర్ మెరిటోరి అందుకున్నారు.