వేదన్యూస్ తెలంగాణ :

భానుడి భగభగలకు తెలంగాణ అగ్నిగుండంలా మారింది. బుధవారం దాదాపు 19 జిల్లాల్లో 46+ డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఈ క్రమంలోనే వివిధ ప్రాంతాల్లో నిన్న ఒక్కరోజే వడదెబ్బకు గురై 9 మంది ప్రాణాలు కోల్పోయారు. ఒక్క ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోనే ఆరుగురు మృతి చెందడం గమనార్హం. మరో నాలుగైదు రోజులు ఎండల తీవ్రత ఉంటుందని వాతావరణ నిపుణులు హెచ్చరిస్తున్నారు.

ఖమ్మం, నల్గొండ, వరంగల్, కరీంనగర్, ఆదిలాబాద్ జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *