వేద న్యూస్, పాపన్నపేట :

సుమారు (55) సం రాల వయసు గల ఓ వృద్దురాలి మృతదేహం ఏడుపాయల చెక్ డ్యాం లో లభ్యమైనట్లు పాపన్నపేట ఎస్ ఐ శ్రీనివాస్ గౌడ్ పేర్కొన్నారు. మంగళవారం చెక్ డ్యాం లో ఓ వృద్దురాలి మృతదేహం గమనించిన స్థానికులు పాపన్న పేట పోలీసులకు సమాచారం అందజేయడం తో హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకొని మృతదేహన్ని వెలికి తీసి మృతురాలి ఆచూకీ కోసంపరిశీలించగా ఎలాంటి ఆచూకీ లభ్యం కాలేదని. మృతురాలి దేహం పై బ్లూ కలర్ నైటీ తోపాటు, చెవులకు రేడిమెట్ కమ్మలు, ముక్కు పుడక ఉందని. మృతురాలి ఫోటోఆధారంగామృతురాలిని గుర్తించిన వారు పాపన్న పేట ఎస్ ఐ శ్రీనివాస్ గౌడ్ చరవాణి 87126 57920, రూరల్ సీఐ కృష్ణమూర్తి 87126 57883 చరవాణి లకు సంప్రదించాలని వారు కోరారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *