వేద న్యూస్, హన్మకొండ :
రక్తదానం ప్రాణదానంతో సమానం అని పుల్ల ప్రవీణ్ అన్నారు. శనివారం సోషల్ మీడియా ద్వారా ఓ వ్యక్తికి రక్తం అవసరమని పెద్దమ్మ గడ్డకు చెందిన పుల్ల ప్రవీణ్ కుమార్ తెలుసుకొని వెంటనే స్పందించి రక్తదానం చేశారు. పెద్దమ్మ గడ్డ అంటేనే రౌడీలగడ్డ అన్నట్టుగా ఉండేది. కానీ ఆ గడ్డపై కూడా మానవత్వం గల మనుషులు ఉన్నారని పుల్ల ప్రవీణ్ నిరూపించాడు. ఈ సందర్భంగా పుల్ల ప్రవీణ్ యువతకు ఒక పిలుపునిచ్చారు ఆపద సమయంలో ప్రతీ ఒక్కరూ రక్త దానం చేసి ప్రాణదాతలుగా మారుదామన్నారు.