ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో మనీలాండరింగ్ ఆరోపణలు ఎదుర్కొంటున్న కేజీవాల్ కు సుప్రీం కోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. 2024 జూన్ 1 వరకు ఆయనకు ఈ మధ్యంతర బెయిల్ మంజూరైంది. జస్టిస్ సంజీవ్ ఖన్నా, దీపాంకర్ దత్తలతో కూడిన ధర్మాసనం ఈ బెయిల్ అభ్యర్థనను విచారించింది. కాగా.. ఈ కేసులో మార్చి 21న కేజీవాల్ కు ఈడీ అరెస్ట్ చేయగా అప్పటి నుంచి జైలులోనే ఉన్నారు.