వేద న్యూస్, కరీంనగర్:

భార్యవియోగంతో దుఖంలో ఉన్న చొప్పదండి  కాంగ్రెస్ శాసనసభ్యుడు మేడిపల్లి సత్యంను యప్ టీవీ, టురిటో అధినేత పాడి ఉదయ్ నందన్ రెడ్డి ఆదివారం పరామర్శించారు.

ఎమ్మెల్యే సత్యం సతీమణి రూపాదేవి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యేకు ధైర్యం చెప్పి పిల్లలను, కుటుంబ సభ్యులను ఓదార్చారు.